ఉప్పల్ ఆర్టీసీ డిపో ఎదుట ఉద్రిక్త పరిస్థితి నె లకొంది.
ఉప్పల్ ఆర్టీసీ డిపో ఎదుట ఉద్రిక్త పరిస్థితి నె లకొంది. అకారణంగా ఓ మహిళా కండాక్టరును బదిలీ చేశారని తోటి కార్మికులంతా ధర్నాకు దిగారు. దీంతో డిపోకు చెందిన సుమారు 70 బస్సులు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు అక్కడికి చేరుకొని నిరసనకారులను సర్దిచెప్పేందుకు యత్నిస్తున్నారు. ఈక్రమంలో అధికారులకు నిరసన కారులకు మధ్య వాగ్వాదం జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.