రంగారెడ్డిలో కాంగ్రెస్కు ఝలక్ ఇచ్చిన జెడ్పీటీసీలు | Ranga Reddy district four ZPTC's join in telangana | Sakshi
Sakshi News home page

రంగారెడ్డిలో కాంగ్రెస్కు ఝలక్ ఇచ్చిన జెడ్పీటీసీలు

Jul 5 2014 11:07 AM | Updated on Mar 18 2019 9:02 PM

రంగారెడ్డి జిల్లాలోని నలుగురు జెడ్పీటీసీలు కాంగ్రెస్కు రాజీనామా చేశారు. యాదవరెడ్డితో సహా ముగ్గురు జెడ్పీటీసీలు శనివారం టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు.

రంగారెడ్డి జిల్లాలోని నలుగురు జెడ్పీటీసీలు కాంగ్రెస్కు రాజీనామా చేశారు. యాదవరెడ్డితో సహా ముగ్గురు జెడ్పీటీసీలు శనివారం టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. దాంతో రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి చెందిన జెడ్పీటీసీలు సంఖ్య తగ్గిపోయింది. దాంతో రంగారెడ్డి జెడ్పీ ఛైర్మన్ పదవిని టీఆర్ఎస్ కైవసం చేసుకునే అవకాశం ఉంది.


మరో వైపు జిల్లా పరిషత్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీల మధ్య ఓ ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందం ప్రకారం రంగారెడ్డి జిల్లా జడ్పీ ఛైర్మన్ పదవిని ఆ రెండు పార్టీలు చెరో రెండున్నరేళ్లు చేపట్టనున్నాయి. అలాగే  వరంగల్, మహబూబ్నగర్ జిల్లాల జెడ్పీ ఛైర్మన్ పీఠాలు కాంగ్రెస్ పార్టీ, వైఎస్ ఛైర్మన్ పీఠాలు టీడీపీ దక్కనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement