ప్రెస్ స్థలాన్ని కోర్టులకు ఇవ్వాలి | Press the space given to the courts | Sakshi
Sakshi News home page

ప్రెస్ స్థలాన్ని కోర్టులకు ఇవ్వాలి

Aug 9 2014 1:45 AM | Updated on Sep 2 2017 11:35 AM

ప్రెస్ స్థలాన్ని కోర్టులకు ఇవ్వాలి

ప్రెస్ స్థలాన్ని కోర్టులకు ఇవ్వాలి

ఖాళీగా ఉన్న చంచల్‌గూడ ప్రింటింగ్ ప్రెస్ స్థలంలో కోర్టుల సముదాయాన్ని నిర్మిస్తే అందరికీ సౌకర్యంగా ఉంటుందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లింగాల నరసింహారెడ్డి అభిప్రాయపడ్డారు.

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లింగాల నరసింహారెడ్డి సూచన
 
హైదరాబాద్:  ఖాళీగా ఉన్న చంచల్‌గూడ ప్రింటింగ్ ప్రెస్ స్థలంలో కోర్టుల సముదాయాన్ని నిర్మిస్తే అందరికీ సౌకర్యంగా ఉంటుందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లింగాల నరసింహారెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రెస్ స్థలాన్ని కోర్టులకోసం కేటాయించేలా ప్రభుత్వంతో చర్చించాలని అడ్వకేట్ జనరల్‌కు సూచించానని ఆయన తెలిపారు. ఈ సముదాయంలోకి జంటనగరాల పరిధిలోని అన్ని కోర్టులను తరలించాలని సూచించారు.

నాంపల్లి క్రిమినల్ కోర్టుల ఆవరణలో న్యాయశాఖ ఉద్యోగుల సొసైటీ ఆర్థికసాయంతో ఏర్పాటు చేసిన ‘ఈ-లైబ్రరీ’ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ, ఇరుకైన ప్రదేశాల్లో, అసౌకర్యాల మధ్య కోర్టులు పనిచేస్తున్నాయని, ఈ నేపథ్యంలో సువిశాలమైన ప్రెస్ స్థలాన్ని కేటాయిస్తే అన్ని వసతులతో కోర్టు కాంప్లెక్స్‌ను నిర్మించవచ్చని అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement