రెండో విడత ‘తెలంగాణకు హరితహారం’ సందర్భంగా తొలిరోజు నాటిన మొక్కల వివరాలను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.
సాక్షి, హైదరాబాద్: రెండో విడత ‘తెలంగాణకు హరితహారం’ సందర్భంగా తొలిరోజు నాటిన మొక్కల వివరాలను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. హైదరాబాద్ మినహా 9 జిల్లాల్లో కోటీ ఆరు లక్షల మొక్కలు నాటినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 25,44,685 మొక్కలు నాటగా, 20 లక్షలకు పైగా మొక్కలతో ఆదిలాబాద్ రెండో స్థానంలో ఉంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు హరితహారాన్ని ప్రారంభించిన నల్లగొండ జిల్లాలో అటవీశాఖ ద్వారా 87 వేల మొక్కలు నాటినట్లు చూపగా, ఇతర శాఖలు నాటిన మొక్కల వివరాలు లేవు. అయితే 2,75,000 మొక్కలు నాటినట్లు ఈ జిల్లా అధికార వర్గాలు తెలిపాయి.
జిల్లాల వారీగా తొలిరోజు (8వ తేదీ) నాటిన మొక్కల వివరాలు
జిల్లా అటవీశాఖ నాటినవి ఇతర విభాగాలు మొత్తం
ఆదిలాబాద్ 1,29,000 19,36,962 20,65,962
నిజామాబాద్ 7,25,095 18,19,590 25,44,685
మెదక్ 2,45,000 7,39,000 9,84,000
రంగారెడ్డి 0 7,58,000 7,58,000
నల్లగొండ 87,000 - 87,000
మహబూబ్నగర్ 27,000 5,56,770 5,83,770
వరంగల్ 3,96,874 9,50,000 13,46,874
ఖమ్మం 7,60,000 6,64,700 14,24,700
కరీంనగర్ 1,75,618 6,28,975 8,04,593
హెచ్ఎండీఏ 28,700
మొత్తం 25,45,587 80,53,997 1,06,28,284