'రాజకీయ వ్యూహంతోనే రాద్దాంతం' | Sakshi
Sakshi News home page

'రాజకీయ వ్యూహంతోనే రాద్దాంతం'

Published Mon, Feb 22 2016 2:02 PM

dattatreya comments on jnu incident

హైదరాబాద్: ప్రతిపక్షాలు రాజకీయ వ్యూహంతోనే జేఎన్యూ ఘటనపై రాద్దాంతం చేస్తున్నాయని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. ఇందుకోసం దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేసే వారిని ప్రతిపక్షాలు వెనుకేసుకొస్తున్నాయని ఆయన విమర్శించారు. జీఎస్టీ బిల్లు వల్ల కార్మికులకు లబ్ది చేకూరుతుందని ఆయన వెల్లడించారు. కేంద్ర మంత్రి వర్గంలో టీఆర్ఎస్ చేరే అంశంపై మాట్లాడుతూ.. ఆ అంశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానికి చెప్పాలని అన్నారు.
 

Advertisement
Advertisement