ప్రజలకు ఇచ్చిన హామీలపై ప్రధాని మోదీ సమీక్షించుకోవాలని కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు.
‘హామీలపై మోదీ సమీక్షించుకోవాలి’
Nov 26 2016 4:15 PM | Updated on Aug 15 2018 2:30 PM
హైదరాబాద్: ప్రజలకు ఇచ్చిన హామీలపై ప్రధాని మోదీ సమీక్షించుకోవాలని కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. శనివారం ఆయనిక్కడ మీడియాతో మాట్లాడుతూ పల్లెలను అభివృద్ధి చేస్తానన్న మోదీ ఇప్పటివరకు చేసిందేమీ లేదన్నారు. పెద్ద నోట్ల రద్దుపై పార్లమెంట్లో ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. రైతులు కరవుతో అల్లాడుతుంటే ఆయన విదేశీ పర్యటనలతో ఎంజాయ్ చేస్తున్నారన్నారు. రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారని, మంత్రులను బొమ్మలుగా చేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని విమర్శించారు. 30 నెలల పాలనలో తెలంగాణకు మోదీ చేసిందేమిటో శ్వేత పత్రం విడుదల చేయాలని పొన్నం డిమాండ్ చేశారు.
Advertisement
Advertisement