
'నరేంద్రమోడీకి చంద్రగ్రహణం పట్టింది'
తెలంగాణ ప్రజల మనోభావాలను కించపరిచేలా గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ వ్యవహరిస్తున్నారని కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆదివారం కరీంనగర్లో ఆరోపించారు.
తెలంగాణ ప్రజల మనోభావాలను కించపరిచేలా గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ వ్యవహరిస్తున్నారని కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆదివారం కరీంనగర్లో ఆరోపించారు. మోడీ వ్యాఖ్యలలో బీజేపీ అసలు రంగు బట్ట బయలు అయిందన్నారు. నరేంద్రమోడీకి చంద్రగ్రహణం పట్టిందని ఎద్దేవా చేశారు. మోడీ వ్యాఖ్యలపై వెంటనే స్పందించాలని తెలంగాణ బీజేపీ నేతలను పొన్నం ప్రభాకర్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ వ్యవహారించిన తీరుపై గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ ఆ పార్టీపై ఇటీవల పలు బహిరంగ సభలలో తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఆ క్రమంలో... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించమంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలను విభజించేసిందంటూ ఎద్దెవా చేశారు. అలాగే పురుడు పోసి తల్లిని చంపిన చందంగా రాష్ట్ర విభజన ప్రక్రియను అమలు చేసిందంటూ కాంగ్రెస్ పార్టీపై మోడీ మాటల తూటాలు వదిలిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మోడీ వ్యాఖ్యాలపై కారీంనగర్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరుపున లోక్ సభకు ఎన్నికైన పొన్నం ప్రభాకర్ పై విధంగా స్పంధించారు.