► ‘సాక్షి’తో కేంద్ర జల సంఘం చైర్మన్ జీఎస్ ఝా
► 1993 తరువాత మదింపు ఇదే తొలిసారి
►వచ్చే ఏడాదికల్లా పూర్తయ్యే అవకాశం
► రైతులు పొదుపుగా నీటిని వాడాలని సూచన
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్న నీటి వనరుల మదింపు కోసం కేంద్ర జల సంఘం చేస్తున్న ప్రయత్నాలు తుదిదశలో ఉన్నాయని సంస్థ చైర్మన్ జీఎస్ ఝా వెల్లడించారు. అత్యాధునిక సాఫ్ట్వేర్ సాయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు వచ్చే ఏడాదికల్లా పూర్తవుతుందని చెప్పారు. 1993 తరువాత ఇలాంటి కార్యక్రమం చేపట్టడం ఇదే మొదటిసారని తెలిపారు. గత అంచనాల ప్రకారం దేశంలో మొత్తం 4,000 బీసీఎం (శతకోటి ఘనపు మీటర్లు) నీటి వనరులు అందుబాటులో ఉండగా.. అందులో 1,860 బీసీఎం నీరు ఆవిరిగా మారుతున్నట్లు లెక్కించారని చెప్పారు. వాతావరణ మార్పులపై జరిగిన ఒక సదస్సులో పాల్గొనేందుకు బుధవారం హైదరాబాద్ వచ్చిన జీఎస్ ఝా ‘సాక్షి’తో మాట్లాడారు. రెండేళ్ల వర్షాభావం తరువాత ఈ ఏడాది దేశవ్యాప్తంగా ఉన్న రిజర్వాయర్లలో సంతృప్తికరమైన స్థాయిలో నీరు అందుబాటులో ఉందని ఆయన చెప్పారు.
గతేడాది ఇదే సమయంతో పోలిస్తే రెట్టింపుగా, గత పదేళ్ల సగటు స్థాయికి సమానంగా జలాలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. వాతావరణ మార్పుల ప్రభావం వ్యవసాయంపై తీవ్రంగా ఉండబోతోందన్న అంచనాల నేపథ్యంలో... రైతులు నీటిని వీలైనంత పొదుపుగా, సమర్థవంతంగా వాడుకోవాలని సూచించారు. భవిష్యత్తులో నీటి లభ్యత తగ్గే పరిస్థితులు వస్తే.. సముద్రపు నీటిని మంచినీటిగా మార్చి సాగుకు వాడుకోవచ్చునని... ఇజ్రాయెల్, మధ్యప్రాచ్య దేశాలు ఇప్పటికే ఆ దిశగా ప్రగతి సాధించాయని తెలిపారు.
పూడిక చేరకుండా చర్యలు
శ్రీశైలం, తుంగభద్రలతోపాటు అనేక రిజర్వాయర్లలో పేరుకుపోయిన పూడికను తీయడం పెద్ద సమస్య కాకపోయినా.. తీసిన మట్టిని ఏం చేయాలన్నది కూడా చూడాలని జీఎస్ ఝా పేర్కొన్నారు. చాలా రిజర్వాయర్లలోని పూడిక సారవంతమైన మట్టి ఉన్నా.. కొన్నింటిలో ఇసుక మాత్రమే ఉందన్నారు. అయితే భవిష్యత్తులో రిజర్వాయర్లలో పూడిక చేరకుండా కొన్ని చర్యలు చేపట్టామని చెప్పారు. వాతావరణ మార్పు ల కారణంగా హిమనీ నదాల (గ్లేసియర్స్) పరిమాణం తగ్గిపోతోందన్న వార్తల నేపథ్యంలో తాము హిమాలయాల్లోని దాదాపు 500 హిమనీనదాలపై అధ్యయనం చేశామన్నారు.
గత కొన్నేళ్లలో వాటిలో కొన్నింటి పరిమాణం తగ్గగా.. కొన్నింటి పరిమాణం 15 శాతం నుంచి 20 శాతం వరకూ పెరిగిందని చెప్పారు. దీని ఫలితంగా హిమనీనదాల పరిమాణం తగ్గుదలకు, వాతావరణ మార్పులకు ప్రత్యక్ష సంబంధం ఉందని కచ్చితంగా చెప్పలేకపోతున్నామని అన్నారు.
నీటి లభ్యతపై దేశవ్యాప్త మదింపు
Published Thu, Nov 3 2016 4:26 AM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
Abinaya: 'అ అంటే అమలాపురం' పాటతో అదరగొట్టిన బ్యూటీ.. ఇప్పటికీ అలానే! (ఫోటోలు)
100 మందికే అనుమతి.. పశ్చిమ బెంగాల్ రాజభవన్ కీలక ప్రకటన
IPL 2024: భువీ విజృంభణ.. నామమాత్రపు స్కోర్కే పరిమితమైన లక్నో
హైదరాబాద్ vs లక్నో సూపర్ జెయింట్స్..ఉప్పల్ ఊగేలా తారల సందడి (ఫొటోలు)
SRH VS LSG: సిక్సర్ల సునామీ.. ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా..!
భారత్లోకి గూగుల్ వాలెట్ వచ్చేసింది.. ఎలా వాడొచ్చంటే?
ప్రముఖ దర్శకుడు కన్నుమూత.. హీరో ఎమోషనల్ పోస్ట్
ఎన్నికల ప్రచారంలో షర్మిలకు షాక్
IPL 2024: ఇవెక్కడి క్యాచ్లు రా బాబు.. చూస్తే ఫ్యూజ్లు ఎగిరిపోవాల్సిందే..!
తప్పక చదవండి
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement