ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు మూడో రోజు కూడా ఫాంహౌస్లో గడిపారు.
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు మూడో రోజు కూడా ఫాంహౌస్లో గడిపారు. సోమవారం ఎర్రవల్లి గ్రామ శివారులో ఉన్న తన వ్యవసాయక్ష్రేతానికి వచ్చిన ఆయన అధికారులతో అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. మంగళవారం ఫాంహౌస్లో తిరుగుతూ పంటలను పరిశీలించారు. బుధవారం ఫాంహౌస్లో నుంచి బయటకు రాలేదని సమాచారం. ఫాంహౌస్లో నుండే తన దత్తత గ్రామాలైన ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల్లో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులపై ఆరా తీసినట్లు తెలిసింది. శుక్రవారం వరకు ఫాంహౌస్లో ఉంటారని సమాచారం.