ఒకసారి సీమోను అనే పరిసయ్యుడు యేసును తన ఇంటికి విందుకు పిలిచాడు. పాపాత్మురాలిగా ముద్రపడిన ఒక స్త్రీ ఆహ్వానం లేకుండానే అక్కడికొచ్చింది. యేసును అత్తరుతో అభిషేకించి, ఏడుస్తూ కన్నీటితో ఆయన పాదాలు తడిపి, తలవెంట్రుకలతో తుడిచి, వాటికి ముద్దు పెట్టింది.
నిజానికి ఇంటికొచ్చిన అతిథి కాళ్లు ఇంటి సేవకులు కడిగితే ఇంటి యజమాని అతనికి ముద్దుపెట్టి సాదరంగా లోనికి తీసుకెళ్లడం నాటి ప్రముఖులైన యూదుల ఇళ్లలోని ఆచారం. తాను చేయని పనులన్నీ ఆమె చేస్తూంటే అభ్యంతర పెట్టని సీమోను, ఈయన నిజంగానే ప్రవక్త అయితే ఆమె పాపాత్మురాలన్న విషయం గ్రహిస్తాడని మనసులో అనుకున్నాడు. యేసు అది గ్రహించి, ‘ఆమె నన్ను విస్తారంగా ప్రేమించింది కనుక ఆమె చేసిన విస్తారమైన పాపాలూ క్షమించబడ్డాయి’ అంటూ, శాంతి గల దానవై వెళ్లమంటూ ఆమెను దీవించాడు (లూకా 7:36-50). ‘లోకంలో అందరూ పాపులే! కాకపోతే కొందరు క్షమించబడిన పాపులు, మరికొందరు ఇంకా క్షమించబడని పాపులు’అన్న సత్యాన్ని ప్రభువు సీమోనుకు పరోక్షంగా తెలిపాడు. సీమోను అతిథి మర్యాదలు చేయకపోగా, ఆ లోటును ఆ స్త్రీ పశ్చాత్తాపంతో కూడిన తన దివ్యప్రవర్తనతో పూడ్చి ఆ విందుకే అందాన్ని తెచ్చింది. అనామకురాలు, సమాజం చేత తృణీకరించబడినదే అయినా ఎంతో నిశ్శబ్దంగా ఆమె చేసిన అసమానమైన ఆనాటి ఆరాధన చరిత్ర పుటలకెక్కింది. దేవుని చేతే శ్లాఘింపబడింది. మనిషిదీ దేవునిదీ, పశ్చాత్తాపానికి, ప్రేమకూ మధ్య ఉన్న అనుబంధమే!
యేసే ఇంటికొచ్చినా ఆయన నుండి నిత్యజీవాన్ని పొందలేకపోయిన దురదృష్టవంతుడు సిమోను కాగా, పిలవని అతిథిగా వచ్చి ప్రభువు పాదాల వద్ద తన పాపాల భారాన్నంతా వదిలించుకుని ఆయన ప్రసాదించిన శాంతిని, క్షమాపణను మూటగట్టుకుని వెళ్లిన ధన్యజీవి ఆ అనామకపు స్త్రీ!!
అందుకే దేవుడిచ్చే నిత్యశాంతిని పొందడం, కోటిరూపాయలు కూడబెట్టినంత తేలిక కాదని మనం గ్రహించాలి. పాస్ పోర్టున్నోళ్లంతా విదేశాలకు వెళ్లినవాళ్లు కానట్టే, దేవుణ్ణి కలిగి ఉన్నామని చెప్పేవాళ్లంతా నిత్యశాంతిని పొందిన వాళ్లు కాదు. చెమటోడ్చి పని చేసే రోజు కూలీ తన పూరి గుడిసెలోనే పచ్చడి మెతుకులు తిని, చింకిచాప మీద ఒళ్లు మరచి నిద్రపోతుంటే, ఏసీ గదుల్లో బతికే ధనికులు, బడాబాబులు ఆకలి లేక, నిద్ర రాక అలమటించడం వెనుక రహస్యం అదే!
దేవుని నిత్యశాంతి అనే నది ‘పశ్చాత్తాపం’ అనే కాలువ ద్వారానే విశ్వాసి జీవితంలోకి ప్రవహిస్తుంది. ప్రేమ, నిస్వార్థత, కరుణ, పరిశుద్ధత, పరోపకారం, నిర్భయత్వం, నీతి అనే వృక్షాలు ఆ నీటితోనే విశ్వాసి జీవితంలో ఎదిగి ఫలిస్తాయి.
- రెవ.టి.ఎ.ప్రభుకిరణ్
పశ్చాత్తాపం ద్వారానే నిత్యశాంతి!
Published Thu, Feb 12 2015 11:19 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మార్చి 04-10)
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
ఆర్సీబీతో మ్యాచ్.. గుజరాత్ జట్టులోకి కొత్త ప్లేయర్! తుది జట్లు ఇవే
గవర్నర్పై ఆరోపణలు.. మమత సర్కారు దూకుడు
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీ దుష్ప్రచారంపై ఈసీ సీరియస్
'లగ్గం' షూటింగ్ పూర్తి.. త్వరలో థియేటర్లలో రిలీజ్
త్వరలో కాంగ్రెస్ చీలిపోతుంది: ఆచార్య ప్రమోద్ కృష్ణం
బోయింగ్ ‘స్టార్ లైనర్’.. సునీత ‘స్టార్ ట్రెక్’!
నా ఐపీఎల్ టీమ్కు మాటిచ్చా.. అందుకే సినిమాలకు బ్రేక్
పలమనేరు: ఉప్పొంగిన అభిమాన సంద్రం (ఫొటోలు)
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement