కూరలో ఉప్పు ఎక్కువైందా.. ఇలా చేయండి

Best Food Tips In Telugu - Sakshi

ఇం‘టిప్స్‌’

► ఇడ్లీ, దోసెల కోసం బియ్యం, మినప్పప్పు నానబెట్టేటప్పుడు ముందే కడగాలి. నానిన తర్వాత గ్రైండ్‌ చేసేటప్పుడు కడగడం వల్ల విటమిన్లు నీటిలో పోతాయి. అంతేకాకుండా దుకాణాల్లో వాటికి పురుగుపట్టకుండా నిల్వ చేయడానికి కీటక నాశినులను గనుక వాడి ఉంటే కడగకుండా నానబెట్టినప్పుడు ఆ అవశేషాలతో కూడిన నీటినే బియ్యం, మినప్పప్పు పీల్చుకుంటాయి కాబట్టి అవన్నీ శరీరంలోకి వెళ్లే ప్రమాదం కూడా ఉంటుంది. 
కూరల్లో ఉప్పు ఎక్కువైనప్పుడు అందులో బంగాళాదుంప ముక్కలను వేయాలి. అధికంగా ఉన్న ఉప్పును పొటాటో పది నిమిషాల్లో పీల్చుకుంటుంది. 
గారెల కోసం తయారు చేసుకున్న పిండిలో నీరు ఎక్కువై నూనెలో వేయగానే అంచుల దగ్గర సన్న పలుకులుగా విడిపోతున్నట్లయితే, పిండిలో ఒక  టేబుల్‌స్పూను నెయ్యి కలపాలి.
కూరలు, పులుసులు, సూప్‌లు మరీ పలచగా ఉన్నట్లనిపిస్తే అందులో ఒక టేబుల్‌స్పూను కార్న్‌ఫ్లోర్‌ కలపాలి. కార్న్‌ఫ్లోర్‌ను అలాగే వేస్తే ఉండలవుతుంది. ముందుగా ఒక కప్పులో వేసి చన్నీటితో కలిపి ఆ మిశ్రమాన్ని కూరల్లో వేస్తే సమంగా కలుస్తుంది.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top