కొత్తపల్లి సుబ్బారాయుడుకు తీవ్ర అస్వస్థత

కొత్తపల్లి సుబ్బారాయుడుకు తీవ్ర అస్వస్థత - Sakshi


హైదరాబాద్ :  పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి కొత్తపల్లి సుబ్బారాయుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దాంతో ఆయన్ని కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం సికింద్రాబాద్‌లోని కిమ్స్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో చేర్చారు. కొత్తపల్లి సుబ్బారాయుడుకు గుండె, శ్వాసకోస సంబంధమైన సమస్యలు ఉన్నట్లు వైద్యులు తెలిపారు.


గత ఏడాది ఆయన బైపాస్ సర్జరీ చేయించుకున్నారు. కాగా ఆయనకు మరింత విశ్రాంతి అవసరం ఉందని వైద్యులు చెప్పారు. మరోవైపు కొత్తపల్లి సుబ్బారాయుడు తరపున ఆయన తనయుడు నాని, సోదరుడు, మాజీ ఎమ్మెల్యే జానకీరామ్ ప్రచారం నిర్వహిస్తున్నారు.

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top