కేసీఆర్ సీఎం అయితే సీమాంధ్రులదే పెత్తనం | Sakshi
Sakshi News home page

కేసీఆర్ సీఎం అయితే సీమాంధ్రులదే పెత్తనం

Published Sun, May 11 2014 12:35 AM

madhu yaskhi takes on kcr

కాంగ్రెస్ ఎంపీ మధుయాష్కీ
 
 మెట్‌పల్లి, న్యూస్‌లైన్: టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు తెలంగాణకు ముఖ్యమంత్రి అయితే సీమాంధ్ర పెట్టుబడిదారుల పెత్తనం కొనసాగిస్తారని ఎంపీ మధుయాష్కీ ఆరోపించారు. కరీంనగర్ జిల్లా మెట్‌పల్లిలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. నిజామాబాద్  ఎంపీగా పోటీ చేసిన కవిత సుమారు రూ.30 కోట్లు ఖర్చు పెట్టారన్నారు, కేసీఆర్ కోట్లు వెచ్చించి హెలికాప్టర్‌లో ఎన్నికల ప్రచారానికి తిరిగారన్నారు.

 

సీమాంధ్ర పెట్టుబడిదారులు ఇచ్చిన డబ్బుతోనే రాజకీయం చేస్తున్నారని, ఆయన అధికారంలోకి వస్తే వారే పెత్తనం సాగిస్తారని అన్నారు.


 

Advertisement
Advertisement