ఆక్వాఫుడ్ గ్రామాల్లో వైయస్ఆర్సీపీ బృందం పర్యటన | ysrcp group to visit mega aqua food factory affected villages in west godavari | Sakshi
Sakshi News home page

ఆక్వాఫుడ్ గ్రామాల్లో వైయస్ఆర్సీపీ బృందం పర్యటన

Oct 4 2016 10:28 PM | Updated on May 29 2018 4:26 PM

జిల్లాలో ప్రభుత్వం నిర్మించనున్న ఆక్వాఫుడ్ ఫ్యాక్టరీ బాధిత గ్రామాల్లో..

పశ్చిమగోదావరి: జిల్లాలో ప్రభుత్వం నిర్మించనున్న ఆక్వాఫుడ్ ఫ్యాక్టరీ బాధిత గ్రామాల్లో వైయస్ఆర్ సీపీ నేతల బృందం బుధవారం పర్యటించనుంది. ఈ మేరకు వైయస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యేలు గ్రంధి శ్రీనివాస్, ముదునూరి ప్రసాదరాజు ప్రకటన చేశారు. మాజీ మంత్రులు పార్థసారథి, మోపిదేవి వెంకటరమణ, వైయస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని ఈ బృందంలో ఉన్నట్లు తెలిపారు.

మెగా ఆక్వాఫుడ్ గ్రామాల వాస్తవ పరిస్ధితులను తెలుసుకునేందుకే నేతల బృందం ఈ పర్యటన చేయనున్నట్లు వెల్లడించారు. ఆక్వాఫుడ్ గ్రామాల ప్రజల అంగీకారంతోనే ప్రభుత్వం ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. తుందుర్రు, బేతపూడి, జొన్నలగరువు గ్రామల్లో 144 సెక్షన్ ఎత్తివేయాలని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement