కుటుంబ కలహాలతో ఇద్దరి ఆత్మహత్య | two suicide from family problems | Sakshi
Sakshi News home page

కుటుంబ కలహాలతో ఇద్దరి ఆత్మహత్య

Oct 22 2016 11:10 PM | Updated on Sep 4 2017 6:00 PM

కుటుంబ కలహాలతో ఇద్దరి ఆత్మహత్య

కుటుంబ కలహాలతో ఇద్దరి ఆత్మహత్య

మండల పరిధిలోని ఓబులరెడ్డిపల్లికి చెందిన వెంకటరమణ కుమారుడు వెంకటనారాయణ(40) కుటుంబ కలహాలతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్‌ఐ చంద్రశేఖర్‌ శనివారం తెలిపారు.

తలుపుల : మండల పరిధిలోని ఓబులరెడ్డిపల్లికి చెందిన వెంకటరమణ కుమారుడు వెంకటనారాయణ(40) కుటుంబ కలహాలతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్‌ఐ చంద్రశేఖర్‌ శనివారం తెలిపారు. ఆయన కథనం మేరకు.. ఓబులరెడ్డిపల్లికి చెందిన వెంకటనారాయణ తన అత్తగారి ఊరైన చెర్వుమోరపల్లి సమీప పొలాల్లో పరుగుల మందు తాగి ఇంటికి వచ్చారు. బంధువులు వైద్యసేవల నిమిత్తం కదిరికి, అక్కడి నుంచి అనంతపురం తరలించారు. కానీ పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలోనే మరణించాడు. ఆయనకు భార్య రాధమ్మ, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

బెళుగుప్పలో మహిళ
బెళుగుప్ప : మండల కేంద్రంలోని బీసీ కాలనీలో కుటుంబ కలహాలతో లక్ష్మి(22) అనే మహిళ శుక్రవారం రాత్రి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె తండ్రి రామాంజినేయులు ఫిర్యాదు మేరకు... రాయదుర్గం మండలం టి.వీరాపురం గ్రామానికి చెందిన రామాంజినేయులు పెద్ద కూతురైన లక్ష్మిని ఆరు సంవత్సరాల క్రితం బెళుగుప్ప బీసీ కాలనీలోని శివకు ఇచ్చి వివాహం చేశారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయంలో దినసరి కాంట్రాక్టు కార్మికుడిగా జీవనం సాగించే శివ కొంతకాలంగా జీతం సక్రమంగా ఇంట్లో ఇచ్చేవాడు కాదు.

ఈ విషయమై వారి మధ్య వచ్చిన వివాదం ముదిరింది. శుక్రవారం సాయంత్రం గొడవ పెద్దదవడంతో లక్ష్మి మనస్థాపానికి గురైంది. ఆ రాత్రి చీర దూలానికి వేలాడదీసి ఉరి వేసుకుని మతి చెందింది. వీరికి నాలుగు సంవత్సరాల  కుమారుడు, తొమ్మిది నెలల కూతురు ఉన్నారు. విషయం తెలుసుకున్న ఇన్‌చార్జి స్టేషన్‌ ఆఫీసర్‌ ఎస్‌ఐ విజయ్‌నాయక్, తహశీల్దార్‌ వెంకటాచలపతి శనివారం మతురాలి ఇంటికెళ్లి పరిశీలించారు. మతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కళ్యాణదుర్గం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టినట్లు ఏఎస్‌ఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement