రెండు ద్విచక్ర వాహనాలు చోరీ | two bikes theft in anantapur | Sakshi
Sakshi News home page

రెండు ద్విచక్ర వాహనాలు చోరీ

Aug 24 2016 11:04 PM | Updated on Aug 25 2018 6:22 PM

వన్‌టౌన్‌ స్టేషన్‌ పరిధిలో వేర్వేరు చోట్ల రెండు ద్విచక్రవాహనాలు చోరీ అయ్యాయి.

అనంతపురం సెంట్రల్‌ : వన్‌టౌన్‌ స్టేషన్‌ పరిధిలో వేర్వేరు చోట్ల రెండు ద్విచక్రవాహనాలు చోరీ అయ్యాయి. రూరల్‌ మండలం పాపంపేటకు చెందిన వెంకటరాముడు పాతూరులోని బ్రహ్మంగారి గుడి దగ్గర ద్విచక్రవాహనం నిలిపి సొంతపనిపై పక్కకు వెళ్లారు. వచ్చే చూసే సరికి ద్విచక్రవాహనం మాయమైంది.

అలాగే సాయినగర్‌లోని వరుణ్‌ హాస్పిటల్‌ వద్ద బుక్కరాయసముద్రం మండలం కొండాపురానికి చెందిన నాగరాజు ద్విచక్రవాహనాన్ని దొంగలించారు. ఈ రెండు ఘటనలపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement