చెట్టును ఢీకొన్న కారు : ముగ్గురి మృతి | Three killed in road accident in tadepalligudem | Sakshi
Sakshi News home page

చెట్టును ఢీకొన్న కారు : ముగ్గురి మృతి

Jul 24 2015 11:24 AM | Updated on Aug 30 2018 3:56 PM

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సమీపంలోని పొండ్రిపల్లు వద్ద బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సమీపంలోని పొండ్రిపల్లు వద్ద బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు చెట్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి.. పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం నిమిత్తం ఏలూరు ఆసుపత్రికి తరలించారు. పుష్కరాలకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు వెల్లడించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement