పాఠం చెబుతూనే తనువు చాలించిన గురువు | Teacher dies of heart attack while teaching in classroom | Sakshi
Sakshi News home page

పాఠం చెబుతూనే తనువు చాలించిన గురువు

Oct 13 2016 8:18 PM | Updated on Sep 4 2017 5:05 PM

దసరా సెలవుల తరువాత గురువారం పాఠశాల పునఃప్రారంభమైన రోజే బోధన చేస్తూ ఒక ఉపాధ్యాయుడు తరగతి గదిలోనే మరణించారు.

కొయ్యూరు (విశాఖపట్నం) : దసరా సెలవుల తరువాత గురువారం పాఠశాలల పునఃప్రారంభమైన రోజే బోధన చేస్తూ ఒక ఉపాధ్యాయుడు తరగతి గదిలోనే మరణించారు. దుచ్చరి మల్లయ్య(52) అనే ఉపాధ్యాయుడు విశాఖ జిల్లా కొయ్యూరు మండలం పనసలపాడు ప్రాథమిక పాఠశాలలో మూడేళ్లుగా ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు.

ఇదే మండలంలోని తన స్వగ్రామం రాజేంద్రపాలెం పంచాయతీ సూరేంద్రపాలెం నుంచి ఆయన గురువారం పిట్టాచలం వరకు బస్సులో వెళ్లారు. అక్కడికి రెండు కిలోమీటర్ల దూరంలోని పనసలపాడుకు నడిచి వెళ్లారు. తరగతి గదిలో విద్యార్థులకు బోధన చేస్తుండగానే అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. తోటి ఉపాధ్యాయులు వెంటనే రాజేంద్రపాలెం ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆయనకు భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement