
తిరుపతి నుంచి వేసవి ప్రత్యేక రైళ్లు
వేసవి సందర్భంగా తిరుపతి నుంచి కొన్ని ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు తిరుపతిలోని రైల్వే సీనియర్ ఉద్యోగి సత్యనారాయణ, చీఫ్ రిజర్వేషన్ ఇన్స్పెక్టర్ ఎస్.ఇన్నయ్య గురువారం మీడియాకు తెలిపారు.
తిరుపతి అర్బన్: వేసవి సందర్భంగా తిరుపతి నుంచి కొన్ని ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు తిరుపతిలోని రైల్వే సీనియర్ ఉద్యోగి సత్యనారాయణ, చీఫ్ రిజర్వేషన్ ఇన్స్పెక్టర్ ఎస్.ఇన్నయ్య గురువారం మీడియాకు తెలిపారు. ఈనెల 23వ తేదీ శనివారం 07432 నెంబరుతో తిరుపతి-కాకినాడ మధ్య తత్కాల్ స్పెషల్ రైలు రాత్రి 7గంటలకు తిరుపతిలో బయల్దేరి గూడూరు, విజయవాడ మీదుగా కాకినాడ టౌన్ వరకు వెళ్తుంది.
తిరుపతి నుంచి నాగర్సోల్(షిరిడీకి 30కి.మీల దూరం) వరకు నడుపుతున్న తత్కాల్ ప్రత్యేక రైలును మే-27వ తేదీ వరకు పొడిగించారు. ఈ రైలు 07417 నెంబరుతో ప్రతి శుక్రవారం ఉదయం 7:30 గంటలకు తిరుపతిలో బయల్దేరి నెల్లూరు, గుంటూరు, సికింద్రాబాద్, మీదుగా నాగర్సోల్ చేరుతుందని చెప్పారు. తిరుపతి నుంచి విశాఖపట్నం వరకు నడుస్తున్న ప్రత్యేక రైలు సర్వీసును కూడా జూన్-14వ తేదీ వరకు పొడిగించారు. ఇది 08574 నెంబరుతో ప్రతి మంగళవారం మధ్యాహ్నం 3:30 గంటలకు తిరుపతిలో బయల్దేరి గూడూరు, విజయవాడల మీదుగా విశాఖపట్నం వరకు నడుస్తుందన్నారు.