హత్యాయత్నంలో కేసులో పోలీసుల ముందడుగు | police progress in murder attempt case | Sakshi
Sakshi News home page

హత్యాయత్నంలో కేసులో పోలీసుల ముందడుగు

Dec 20 2016 12:13 AM | Updated on Jul 30 2018 8:37 PM

ఆత్మకూరు పట్టణంలో ఆదివారం సంచలనం సృష్టించిన న్యాయవాది హత్యాయత్నం కేసులో పోలీసులు నిందితులను గుర్తించినట్లు సమాచారం.

సీసీ కెమెరా ద్వారా నిందితుల గుర్తింపు  
 
ఆత్మకూరు రూరల్: ఆత్మకూరు పట్టణంలో ఆదివారం సంచలనం సృష్టించిన న్యాయవాది హత్యాయత్నం కేసులో పోలీసులు నిందితులను గుర్తించినట్లు సమాచారం.   సంఘటన స్థలం సమీపంలోని పెట్రోలు బంక్‌లోని సీసీ కెమెరాల ఫుటేజ్‌ను సోవారం పోలసులు పరిశీలించారు. ఈ ఫుటేజ్‌లలో న్యాయవాది అజ్మతుల్లాను కారుతో ఢీకొట్టించి రోడ్డుపై ఈడ్చుకెళ్తున్న దృశ్యాలు స్పష్టంగా కనిపించినట్లు తెలుస్తోంది. ఆత్మకూరు సీఐ కృష్ణయ్య సంఘటన స్థలం చుట్టు పక్కల ఉన్న వారిని దర్యాప్తులో భాగంగా ప్రశ్నించారు. అయితే పెట్రోలు బంక్‌ సిబ్బంది, హోటళ్ల యజమానులు ఈ విషయంలో మౌనం పాటించారు. ఽఘటన జరిగిన ప్రాంతంలోని హోటల్‌ను ఆదివారం సాయంత్రం నుంచే మూసివేశారు. ఈకేసును వేగవంతంగా దర్యాప్తు చేస్తున్నామని, నిందితును త్వరలోనే అరెస్ట్‌ చేస్తామని సీఐ తెలిపారు.    
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement