ప్రమాదవశాత్తు రైలుకింద పడి ప్రయాణికుడి మృతి | passenger dies of train accident | Sakshi
Sakshi News home page

ప్రమాదవశాత్తు రైలుకింద పడి ప్రయాణికుడి మృతి

Aug 5 2017 9:20 PM | Updated on Apr 7 2019 3:23 PM

రన్నింగ్‌లో ఉన్న రైలు ఎక్కుతూ జారిపడి ఓ ప్రయాణికుడు మృతి చెందాడు.

గుంతకల్లు: రన్నింగ్‌లో ఉన్న రైలు ఎక్కుతూ జారిపడి ఓ ప్రయాణికుడు మృతి చెందాడు. జీఆర్పీ పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గుంతకల్లుకు చెందిన నాగరాజు (53) ధర్మవరంగేట్‌ రోడ్డులో ఓ గోల్డ్‌ స్మిత్‌ షాపులో పని చేసేవాడు. నాగరాజు శనివారం ఉదయం తన సొంత పని నిమిత్తం బెంగళూరు వెళ్లేందుకు ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌ రైలుకు టిక్కెట్‌ తీసుకున్నాడు. అప్పటికే రన్నింగ్‌లో ఉన్న రైలును ఎక్కడానికి వెళ్లి ప్రమాదవశత్తు జారి రైలు కిందకు పడ్డాడు. ఈ ప్రమాదంలో కాలు విరిగి తీవ్రంగా గాయపడ్డ నాగరాజును 108 వాహనంలో ప్రభుత్వ ఆస్పత్రికి తరిలించారు. రక్తం ఎక్కువగా పోవడంతో ఆయన చిక్సిత పొందుతూ మృతి చెందాడు. జీఆర్పీ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement