Sakshi News home page

టీ తాగేందుకు వచ్చి మృత్యుఒడిలోకి..

Published Mon, Jul 25 2016 1:53 AM

oldman dead

తాడేపల్లిగూడెం రూరల్‌ : తాడేపల్లిగూడెం గూడ్స్‌ షెడ్డు నుంచి తణుకు వైపు వెళ్తున్న లోడు లారీ అతివేగంగా వస్తూ రోడ్డు దాటుతున్న వృద్ధుడిని ఢీకొట్టడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడని పట్టణ పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక వార్ఫ్‌ రోడ్డు ఇరిగేషన్‌ కార్యాలయం వెనుక నివాసముంటున్న బంగారు అప్పారావు (55) ఆదివారం టీ తాగేందుకు పోలీస్‌ ఐలాండ్‌ సెంటర్‌లో రోడ్డు దాటుతుండగా గూడ్స్‌ షెడ్డు నుంచి వస్తున్న లోడు లారీ ఢీకొంది. దీంతో కిందపడిన సుబ్బారావు రెండు కాళ్లపై నుంచి లారీ వెళ్లడంతో తీవ్ర గాయాలయ్యాయి. కొన ఊపిరితో ఉన్న అతడ్ని అంబులెన్స్‌లో ఏరియా ఆస్పత్రిగా తరలిస్తుండగా కన్నుమూశారు. మృతుని కుమారుడు బంగార్రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టణ ఎస్సై ఎం.సూర్యభగవాన్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
 

Advertisement

What’s your opinion

Advertisement