తాడేపల్లిగూడెం రూరల్ : తాడేపల్లిగూడెం గూడ్స్ షెడ్డు నుంచి తణుకు వైపు వెళ్తున్న లోడు లారీ అతివేగంగా వస్తూ రోడ్డు దాటుతున్న వృద్ధుడిని ఢీకొట్టడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడని పట్టణ పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక వార్ఫ్ రోడ్డు ఇరిగేషన్ కార్యాలయం వెనుక నివాసముంటున్న బంగారు అప్పారావు (55) ఆదివారం టీ తాగేందుకు పోలీస్ ఐలాండ్ సెంటర్లో రోడ్డు దాటుతుండగా గూడ్స్ షెడ్డు నుంచి వస్తున్న లోడు లారీ ఢీకొంది. దీంతో కిందపడిన సుబ్బారావు రెండు కాళ్లపై నుంచి లారీ వెళ్లడంతో తీవ్ర గాయాలయ్యాయి. కొన ఊపిరితో ఉన్న అతడ్ని అంబులెన్స్లో ఏరియా ఆస్పత్రిగా తరలిస్తుండగా కన్నుమూశారు. మృతుని కుమారుడు బంగార్రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టణ ఎస్సై ఎం.సూర్యభగవాన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Related news
-
అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న బిడ్డ కళ్లముందే...
తూర్పు గోదావరి: స్కూలుకని బయలుదేరిన కొడుకు తిరిగిరాని లోకాలకు తరలిపోవడం తల్లిదండ్రులను శోకసంద్రంలో ముంచింది. మండపేట సత్యశ్రీ రోడ్డులో శుక్రవారం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో తొమ్మిదవ తరగతి విద్యార్థి మృతి చెందడం పట్టణంలో విషాదాన్ని నింపింది. స్థానిక సంఘం కాలనీకి చెందిన కోనె మహేష్ సత్యశ్రీ రోడ్డులోని ఎస్ఎస్వీవీ మున్సిపల్ హైస్కూల్ లో తొమ్మిదవ తరగతి చదువుతున్నాడు. రోజూ మాదిరి ఉదయం కాలనీ నుంచి సైకిల్పై పాఠశాలకు బయలుదేరాడు. బైపాస్ రోడ్డు దాటి కోళ్ల ఫారాల మలుపు వద్దకు వచ్చేసరికి వెనుక నుంచి వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో మహేష్ అక్కడికక్కడే మృతిచెందాడు. డ్రైవర్ నిర్లక్ష్యంగా లారీ నడపడం, రోడ్డు బెర్ములు కిందికి కుంగిపోయి ఉండటం వలనే ప్రమాదం సంభవించిందని స్థానికులు అంటున్నారు. స్కూల్కు వెళుతున్న బాలుడు రోడ్డుపై మృతిచెంది ఉండటం దారిన వెళ్లే వారిని కలచివేసింది. మహేష్ మృతితో అతని కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. తండ్రి శ్రీనివాస్ భవన నిర్మాణ కారి్మకుడిగా పనిచేస్తూ భార్య, కుమారుడు, కుమార్తెను పోషించుకుంటున్నాడు. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న బిడ్డ కళ్లముందే విగతజీవిగా పడి ఉండటం చూసి తల్లిదండ్రులు విలపించిన తీరు చూపరులకు కంటతడి పెట్టించింది. పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అర్ధరాత్రి ఇంటిపైకి దూసుకెళ్లిన లారీ
వేలూరు: అర్ధరాత్రి సమయంలో గాడ నిద్రలో ఉండగా లారీ ఇంటిపైకి దూసుకెళ్లడంతో గోడ కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వివరాలు.. తిరువణ్ణామలై జిల్లా వందవాసి నుంచి కట్టల లోడ్డుతో లారీ శుక్రవారం రాత్రి బయలుదేరింది. సేతుపట్టు సమీపంలోని నంబేడు వద్ద వస్తున్న లారీ అదుపు తప్పి రోడ్డు పక్కనున్న ఇంటిని అతివేగంగా ఢీకొంది. ఆ సమయంలో ఇంటిలో గాఢనిద్రలో ఉన్నవారిపై గోడలు విరిగి పడ్డాయి. ఆ సమయంలో మునియప్పన్, భార్య జయలక్ష్మి, కుమారుడు ఏయుమలై, కోడలు సుగన్య ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే పెద్ద శబ్దం రావడంతో సమీపంలో ఉన్న వారు గమనించి వెంటనే చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న సేతుపట్టు పోలీసులు కేసు నమోదు చేసి పరారైన లారీ డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. -
దైవ దర్శనం కోసం వెళ్తూ.. లారీ ఢీకొని బాలుడి దుర్మరణం..
మహబూబ్నగర్: దైవ దర్శనం కోసం కుటుంబంతో కలిసి ఆదివారం సాయంత్రం ద్విచక్ర వాహనంపై వెళ్తున్న క్రమంలో రాయాపురం సమీపంలో లారీ రూపంలో బాలుడిని బలి తీసుకుంది. వివరాల్లోకి వెళితే.. బింగిదొడ్డితండాకు చెందిన వీరేష్నాయక్, లక్ష్మి దంపతుల కుమారుడు గౌతమ్ (6)తో పాటుగా ఏడేళ్ల బాలిక పరిణికతో కలిసి ద్విచక్ర వాహనంపై ఉరుకుంద వీరన్న స్వామి దర్శనం కోసం బయలుదేరారు. వీరు రాయాపురం దాటి గట్టు వైపు వస్తుండగా, రాయాపురం స్టేజీ వద్ద ఉన్న భారత్మాల రోడ్డు నిర్మాణం క్యాంపులో సిమెంట్ బస్తాలను దింపి గద్వాల వైపు వెళ్తున్న లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో గౌతమ్ అక్కడిక్కడే మృతి చెందాడు. వీరేష్నాయక్, లక్ష్మి తీవ్రంగా గాయపడగా, పరిణిక స్వల్ప గాయాలతో బయటపడింది. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ లారీని ఆపకుండా పరారయ్యాడు. చుట్టు పక్కల రైతులు విషయాన్ని గుర్తించి పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో గ్రామస్తులు పెద్ద ఎత్తున సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడ్డ వారిని గద్వాల ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ నందికర్ పోలీస్ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరకున్నారు. గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు. రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. పరిస్థితి చేయిదాటకుండా కేటిదొడ్డి ఎస్ఐ వెంకటేష్, మల్దకల్ ఎస్ఐ కల్యాణ్, అయిజ ఎస్ఐ నరేష్ రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్న ప్రాంతానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఆందోళనకారులకు నచ్చ చెప్పారు. దీంతో గ్రామస్తులు శాంతించారు. ఉండవెల్లి వద్ద పట్టుబడ్డ లారీ.. రాయాపురం వద్ద రోడ్డు ప్రమాదానికి కారణమైన లారీని హైదరాబాద్–కర్నూలు జాతీయ రహదారి ఉండవెల్లి వద్ద పట్టుకున్నట్లు ఎస్ఐ నందికర్ తెలిపారు. చుట్టుపక్కల పొలాల్లో పనులు చేసుకుంటున్న రైతులు ఇచ్చిన సమాచారం ఆధారంగా ప్రమాదానికి కారణమైన లారీ వివరాలను సేకరించి, జీపీఎస్ ఆధారంగా గద్వాల, ఎర్రవల్లి మీదుగా జాతీయ రహదారిపై వెళ్తున్న లారీని ఉండవెల్లి పోలీసుల సహకారంతో పట్టుకున్నారు. -
రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి
అన్నమయ్య: పట్టణ పరిధిలోని చిట్వేలి బైపాస్ రోడ్డు వద్ద మంగళవారం లారీ ఢీకొన్న ప్రమాదంలో ఉదయ్కిరణ్(15) అనే విద్యార్థి మృత్యువాత పడ్డాడు. మండలంలోని ఎస్.కొత్తపల్లికి చెందిన రోజువారీ కూలీలైన తిరుమలేశు, రాజేశ్వరిలకు ముగ్గురు కుమారులు. తల్లిదండ్రులు తమ ముగ్గురు బిడ్డల్ని పట్టణంలోని ప్రైవేటు పాఠశాలల్లో చదివిస్తున్నారు. పెద్ద కొడుకు ఉదయ్కిరణ్ పదో తరగతి చదవుతున్నాడు. ఇందులో భాగంగా మంగళవారం సాయంత్రం తమ బంధువుల ఇంటికి వెళ్లేందుకు చిట్వేలి బైపాస్ రోడ్డు దాటుతుండగా రాజంపేట నుంచి రేణిగుంటవైపు వెళ్తున్న లాజిస్టిక్ లారీ ఢీకొంది. దీంతో ఉదయ్ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజంపేట ఆసుపత్రికి తరలించారు. కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. -
కిల్లింగ్.. ఓవర్లోడ్!
ఆదిలాబాద్: జిల్లాలో ఇసుక, కంకర, విద్యుత్ స్తంభాలు తరలిస్తున్న వాహన యజమానులు ఎ లాంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదు. ఓవర్ లోడ్తో వెళ్తున్న వాహనాలు బోల్తా పడటం, రోడ్డు ప్రమాదా లకు కారణమవుతుండటంతో అమాయకులు ప్రా ణాలు కోల్పోతున్నారు. క్వారీల నుంచి ఇతర రాష్ట్రాలకు కంకరను తరలించే క్రమంలో గ్రామీణులు టి ప్పర్ చక్రాల కింద నలిగిపోతున్నారు. ఇటీవల కౌ టాల మండలం వైగాం సమీపంలో ఓవర్ లోడ్తో వి ద్యుత్ స్తంభాలు తరలిస్తున్న ట్రాక్టర్ బోల్తా పడడంతో ఇద్దరు కూలీలు మృతి చెందిన విషయం తెలిసిందే. ట్రాక్టర్లు, ట్రిపర్లు అధిక లోడుతో వరుసగా పదుల సంఖ్యల్లో పల్లెల మీదుగా దూసుకెళ్తున్నాయి. నిత్యం రాకపోకలు సిర్పూర్(టి), కౌటాల, చింతలమానెపల్లి, బెజ్జూర్ మండలాల్లో ఓవర్లోడ్తో భారీ వాహనాలు నిత్యం రాకపోకలు కొనసాగిస్తున్నాయి. ఆసిఫాబాద్, తిర్యాణితోపాటు ఏజెన్సీ ప్రాంతాల మీదుగా ఇసుకు అక్రమ రవాణా అధికంగా జరుగుతోంది. 10 టైర్లు ఉన్న లారీ 20 టన్నులతో వెళ్లాల్సి ఉండగా 25 నుంచి 26 టన్నులతో.. 12 టైర్ల లారీ 26 టన్నులతో వెళ్లాల్సి ఉండగా సుమారు 32 టన్నులకు పైగానే లోడ్తో తిప్పుతున్నారు. గతేడాది డిసెంబర్ 4న కౌటాల మండలం యాపలగూడలో ట్రిప్పర్ ఢీకొని నాలుగేళ్ల చిన్నారి మృత్యువాత పడింది. వాస్తవానికి ట్రాక్టర్ వెనుక భాగంలో కేవలం 10 టన్నులను మాత్రమే తరలించేందుకు వీలుంటుంది. కానీ 15 నుంచి 17 టన్నుల వరకు లోడింగ్ చేస్తున్నారు. ఈ కారణంగా వాహనాలు అదుపుతప్పి బోల్తా పడటమో, ఇతర వాహనాలను ఢీకొట్టడమో జరుగుతోంది. కౌటాల మండలం ముత్తంపేట శివారులోని కంకర క్రషర్ల నుంచి రాత్రీపగలు తేడా లేకుండా కంకర తరలిస్తున్నారు. వాగులు, నదుల నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న క్రమంలోనూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ప్రమాదాలు జరిగినప్పుడు కేవలం పరిహారం చెల్లించి చేతులు దులుపుకొంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తనిఖీలు చేపడుతున్నాం ఓవర్ లోడుతో వెళ్తున్న కంక ర టిప్పర్లు, ఇసుక ట్రాక్టర్లు, విద్యుత్ స్తంభాలు తరలించే ట్రాకర్లను నిత్యం తనిఖీ చేస్తూనే ఉన్నాం. సంబంధిత అధికారులకు సైతం చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశాం. నిబంధనలను పాటించని వాహనాల యాజమానులకు జరిమానా విధిస్తున్నాం. నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాలను సీజ్ చేస్తాం. – జి.లక్ష్మి, ఆర్టీవో, ఆసిఫాబాద్ జాడలేని తనిఖీలు.. ఓవర్ లోడింగ్ వాహనాల రాకపోకలను నిరంతరం పర్యవేక్షించాల్సిన రవాణా శాఖ, మైనింగ్ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ప్రమాదాలు జరిగిన సమయంలో కేవలం ప్రజల దృష్టిని మళ్లించేందుకు నామమాత్రంగా తనిఖీలు చేపడుతున్నారని స్థానికులు మండిపడుతున్నారు. ఇటీవల వరుస ఘటనల్లో పలువురు ప్రాణాలు కోల్పోయినా అధికారులు ఓవర్ లోడింగ్ వాహనాల ను తనిఖీలు చేసి కనీస జరిమానాలు విధించకపోవడం గమనార్హం.
Related News by category
-
ఉప్పొంగిన జనగోదావరి
మేమంతా.. మీ వెంటే.. తేతలిలో అభిమానుల సందడిరావులపాలెం.. జన సంద్రం.. రావులపాలెంలో అశేష జనవాహినికి అభివాదం చేస్తున్న సీఎం జగన్●సాక్షి, భీమవరం: జననేత జనాదరణ ముందు మండు వేసవి చిన్నబోయింది.. ఓ వైపు నిప్పుల కొలిమిని తలపిస్తూ ప్రచండ భానుడి ప్రతాపం.. మరోవైపు వేడిసెగలు కక్కుతున్న జాతీయ రహదారి.. సంక్షేమ సారథిని చూసేందుకు పోటెత్తిన జనాభిమానం ముందు ఇవన్నీ వెలవెలబోయాయి.. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర పశ్చిమగోదావరి జిల్లాలో జన గోదారిని తలపిస్తూ దిగ్విజయంగా ముగిసింది. ఒకరోజు విరామం తర్వాత శ్రీరామనవమి వేడుకల నేపథ్యంలో మేమంతా సిద్ధం బస్సు యాత్రకు బుధవారం విరామం ప్రకటించిన విషయం తెలిసిందే. తణుకు మండలం తేతలి వద్ద రాత్రి బస క్యాంపు నుంచి గురువారం ఉదయం 10.30 గంటలకు బస్సు యాత్ర ప్రారంభమైంది. అప్పటికే వేడిగాలులతో సూర్యప్రతాపం ఉక్కిరిబిక్కిరి చేస్తున్నా సీఎం జగన్ను చూ సేందుకు జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున పార్టీశ్రేణులు, అభిమానులు క్యాంపు సమీపంలోని జాతీయ రహదారిపైకి చేరుకున్నారు. సీఎం జగన్ వారందరినీ చూసి బస్సు ఆపి బయటకు వచ్చి అభివాదం చేస్తూ, పలకరిస్తూ ఉత్సాహం నింపారు. ‘ప్లీజ్ హెల్ప్’ అంటూ ప్లకార్డులతో ఉన్న మహిళలను చూసి.. వారితో మాట్లాడారు. తేతలి సెంటర్, తణు కు వై.జంక్షన్, శర్మిష్ట్ట జంక్షన్, ఉండ్రాజవరం జంక్షన్, పెరవలి వై.జంక్షన్ మీదుగా బస్సు యాత్ర సా గింది. చుట్టుపక్కల గ్రామాల నుంచి వందలాదిగా ప్రజలు ఆయా కూడళ్ల వద్దకు చేరుకుని జననేత రా క కోసం ఎదురుచూశారు. బస్సులోని సీఎం జగన్ ను చూసి జై జగన్, సీఎం.. సీఎం.. అంటూ నినాదాలతో హోరెత్తిస్తూ ఘన స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి సైతం జనం ఉన్న ప్రతిచోటా బస్సు ఆపి బయటకు వచ్చి వారితో మాట్లాడారు. అలాగే వారి వినతులపై తక్షణమే స్పందిస్తూ, చిరునవ్వుతో అభివాదం చేస్తూ అందరిలో ఉత్సాహం నింపారు. సత్వరమే స్పందించి.. పక్షవాతంతో బాధపడుతున్న తన 12 ఏళ్ల చిన్నారికి పింఛన్ ఇప్పించాలని వడ్డూరుకు చెందిన తల్లి కో రగా, తేతలిలో జన్యుపరమైన సమస్యలతో బాధడుతున్న నరసింహ అనే దివ్యాంగునికి ప్రస్తుతం ఇస్తున్న రూ.3 వేల పింఛన్ రూ.5 వేలు చేయాలని అతని కుటుంబ సభ్యులు సీఎం జగన్ను కోరారు. ఆయా వినతులపై వెంటనే స్పందించిన ముఖ్య మంత్రి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. సిద్ధాంతం.. ఘన స్వాగతం గోదావరి వశిష్ట వారధి (సిద్దాంతం బ్రిడ్జి) సమీపంలో ఆచంట నియోజకవర్గం దొంగరావిపాలెం వద్ద ఎమ్మెల్యే, ఆచంట అభ్యర్థి చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఆధ్వర్యంలో బస్సుయాత్రకు ప్రజలు ఘ నంగా స్వాగతం పలికారు. సీఎం జగన్ బయటకు వచ్చి వారిని పలకరించారు. దొడ్డివారిపాలెంకు చెందిన రవికుమార్ రెండు కిడ్నీలు పాడయ్యాయని, వైద్యానికి ఇబ్బంది పడుతున్నానని, సిద్ధాంతానికి చెందిన కొబ్బరి బొండాల వ్యాపారి వేండ్ర మోహనరావు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నానని, అనారోగ్య సమస్యలు ఉన్నాయని, పెనుగొండకు చెందిన విద్యార్థి మైలే డేవిడ్ జార్జ్ ప్రైజ్ ట్రై స్కూటీ, జగనన్న విద్యాదీవెన కోసం అభ్యర్థించగా ఆయా వినతుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ తన సిబ్బందికి సూచించారు. అనంతరం వశిష్ట వారధి దాటి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోకి యాత్ర ప్రవేశించడంతో పశ్చిమగోదావరి జిల్లాలో రెండు రోజుల పాటు జరిగిన మేమంతా సిద్ధం బస్సుయాత్ర దిగ్విజయంగా ముగిసింది. బస్సు యాత్రలో మంత్రి, తణుకు అభ్యర్థి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, నరసాపురం పార్లమెంట్ అభ్యర్థి గూడూరి ఉమాబాల సీఎం జగన్ పక్కన ఉన్నారు. అదృష్టంగా భావిస్తున్నా.. సీఎం జగన్ను స్వయంగా కలవడం అదృష్టంగా భావిస్తున్నా. నా సమస్యను సావధానంగా విని సత్వర పరిష్కారానికి ఆదేశాలు ఇచ్చారు. నాకు ట్రైస్కూటీ మంజూరు చేయమని, జగనన్న విద్యాదీవెన ఆఖరి విడత నిలిచిపోయిందని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లాను. – మైలే డేవిడ్ జార్జ్ ప్రైజ్, పెనుగొండ సావధానంగా విన్నారు కొబ్బరి బొండాల వ్యాపారంలో తీవ్రంగా నష్ట పోయానని, ఆర్థికంగా చితికి పోవడంతో అనారోగ్యానికి గురై ఇబ్బంది పడుతున్నానని సీఎం జగన్కు విన్నవించుకున్నా. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నా.. ఆయన నా సమస్యను సావధానంగా విని భరోసా ఇచ్చారు. – వేండ్ర మోహనరావు, సిద్ధాంతం అడుగడుగునా అమితాదరణ సీఎం జగన్ బస్సు యాత్రకు అపూర్వ స్పందన జాతీయ రహదారిపైకి పోటెత్తిన జనం జై జగన్ నినాదాలతో మార్మోగిన హైవే ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగిన ముఖ్యమంత్రి పశ్చిమగోదావరి జిల్లాలో ముగిసిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర -
బస్సు యాత్ర విజయవంతం
మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తణుకు అర్బన్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర, బహిరంగ సభ విజయవంతమయ్యాయని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. గురువారం తణుకులోని క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. భీమవరంలో సిద్ధం సభ జనసంద్రమైందని, బస్సు యాత్రకు ప్రజలు నీరాజనాలు పట్టారన్నారు. మండుటెండను సైతం లెక్కచేయకుండా అ వ్వాతాతలు, యువత, చిన్నారులు, మహిళలు సైతం రోడ్లపైకి వచ్చి సీఎం జగన్కు అభివాదాలు చేసిన దృశ్యాలు కనిపించాయన్నారు. రాజకీయంగా ఇంతటి ప్రజాదరణ పొందిన సీఎం జగన్ చరిత్రలో నిలుస్తారన్నారు. బస్సుయాత్ర, సిద్ధం సభలతో వెన్నులో వణుకు పుడుతున్న చంద్రబాబు అండ్కో దాడులకు దిగుతున్న పరిస్థితుల్లో సైతం జగన్ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో ప్రజల్లోకి వస్తున్నారన్నారు. బస్సుయాత్రను జయప్రదం చేసిన పార్టీ శ్రేణులు, ప్రజలకు మంత్రి కారుమూరి కృతజ్ఞతలు చెప్పారు. యాత్ర సాగిందిలా.. పశ్చిమగోదావరి జిల్లా తేతల్లిలో రాత్రి బస క్యాంపు నుంచి సీఎం జగన్ తణుకు, సిద్దాంతంమీదుగా డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా గోపాలపురం, ఈతకోట, రావులపాలెం, జొ న్నాడ జంక్షన్కు చేరుకున్నారు. అక్కడి నుంచి మూలస్థానం క్రాస్, చెముడులంక, మడికి జంక్షన్, పొట్టిలంకకు చేరుకున్నాక బస్సు యాత్ర భోజన విరామానికి కొద్దిసేపు ఆగింది. సా యంత్రం వేమగిరి జంక్షన్, ధవళేశ్వరం ఇండస్ట్రియల్ ఏరియా, బొమ్మూరు సెంటర్ రాజ మండ్రి సిటీ ముఖద్వారం మోరంపూడి జంక్షన్ కు సాయంత్రం 5.34 గంటలకు సీఎం జగన్ చే రుకున్నారు. అక్కడ నుంచి రాజమండ్రి నగరంలోకి యాత్ర ప్రవేశించింది. మోరంపూడి జంక్షన్ నుంచి తాడితోట, షెల్టన్ సెంటర్, దేవీచౌక్, పేపరు మిల్లు, కాతేరు గామన్ బ్రిడ్జి, ది వాన్చెరువు, రాజానగరం మీదుగా ఎస్టీ రా జాపురంలో రాత్రి బస క్యాంపునకు చేరారు. -
ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ
భీమవరం: భీమవరం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఆర్డీవో కే శ్రీనివాసులురాజు తెలిపారు. గురువారం తన చాంబర్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నామినేషన్ దాఖలు చేసే అభ్యర్ధి నేరుగా గాని ప్రతిపాదనతోగానీ నేటి నుంచి 25వ తేదీ గురువారం వరకు నామినేషన్లు దాఖలు చేయకోవచ్చునని అన్నారు. ప్రభుత్వ సెలవు రోజుల్లో కాకుండా ఏరోజైనా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల లోపు భీమవరం మున్సిపల్ ఆఫీస్ ప్రాంగణంలోని ఆర్డీవో కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి, సహాయ రిటర్నింగ్ అధికారి, తహసీల్దార్కు గానీ నామినేషన్లు అందించవచ్చన్నారు. ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్ల పత్రాలను పొందవచ్చునని, ఈనెల 26న ఉదయం 11 గంటల నుంచి రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ల పరిశీలన జరుగుతుందని, ఏదైనా అభ్యర్ధి నామినేషన్ ఉపసంహరణ సందర్భంలో ఫారం–5 ద్వారా అభ్యర్ధి రాత పూర్వకంగా ఉపసంహరించుకోవచ్చునని, అనంతరం అభ్యర్థులకు గుర్తులు కేటాయించడం జరుగుతుందన్నారు. మే 13న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని తెలిపారు. 25 వరకు నామినేషన్ల స్వీకరణ, 26న నామినేషన్ల పరిశీలన, 29న ఉపసంహరణ ఆర్డీవో శ్రీనివాసులు రాజు -
నామినేషన్లకు పటిష్ట బందోబస్తు
భీమవరం: ఎన్నికల నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ డాక్టర్ అజిత తెలిపారు. నామినేషన్ల సందర్భంగా అభ్యర్థులు పాటించాల్సిన ఎన్నికల నియమావళికి సంబంధించి గురువారం ఆమె ప్రకటనలో తెలిపారు. జిల్లావ్యాప్తంగా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు, ఒక పార్లమెంటు స్థానానికి అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయనున్న నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. అభ్యర్థులు, సానుభూతిపరులు ఎన్నికల సంఘం విధివిధానాలను తప్పక పాటించాలని తెలిపారు. ఎన్నికల కోడ్ అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. నామినేషన్ ర్యాలీలు, ఊరేగింపులకు అనుమతులు పొందాలని, సమయం, వారు ప్రయాణించే మార్గాం వివరాలు ముందుగా తెలియజేయాలని సూచించారు. ఊరేగింపులో పది వాహనాలకు మించి ఉండరాదని, డీజేలు, మందు గుండు సామగ్రిని ఉపయోగించాదన్నారు. అభ్యర్థుల ప్రసంగాల్లో ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా చూడాలన్నారు. నామినేషన్ల దాఖలు సమయంలో రిటర్నింగ్ అధికారి కార్యాలయం పరిధిలో 100 మీటర్ల లోపులో అభ్యర్థికి చెందిన మూడు వాహనాలను మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. గుడాల గోపికి రిటైర్డ్ ఎస్పీ మూర్తి మద్దతు పోడూరు: పాలకొల్లు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ అభ్యర్ధి గుడాల గోపికి పెనుమదం గ్రామానికి చెందిన రిటైర్డ్ ఎస్పీ జీవీఎస్ మూర్తి మద్దతు తెలియజేశారు. పెనుమదంలో గురువారం వైఎస్సార్ సీపీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. హైదరాబాద్లో స్ధిరపడిన రిటైర్డ్ ఎస్పీ మూర్తి ఎమ్మెల్యే అభ్యర్ధి గుడాల గోపికి తన మద్దతు తెలిపారు. ఆత్మీ య సమావేశం సందర్భంగా ఆయన మండల కన్వీనర్ పితాని చిన్నా, గ్రామక కమిటీ అధ్యక్షుడు గెద్దాడ ఏసులతో ఫోన్లో మాట్లాడారు. ఎన్నడూ లేనివిధంగా అన్నివర్గాలకు సమన్యాయంతో పరిపాలన అందిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనకు తన సంఘీభావం తెలుపుతూ పాలకొల్లు ఎమ్మెల్యే అభ్యర్ధి గుడాల గోపికి, ఎంపీ అభ్యర్ధి గూడూరి ఉమాబాలకు తన మద్దతు తెలియజేస్తున్నట్లు మూర్తి స్థానిక నాయకులతో మాట్లాడుతూ చెప్పారు. మూర్తి మద్దతుతో మరింత ఉత్సాహంతో ఎమ్మెల్యే అభ్యర్ధి గుడాల గోపి, ఎంపీ అభ్యర్ధి గూడూరి ఉమాబాల విజయానికి మరింత ఉత్సాహంగా కృషి చేస్తామని పెనుమదం వైఎస్సార్ సీపీ నాయకులు తెలిపారు. -
వైఎస్సార్ సీపీలో చేరిన కూటమి నేతలు
తాడేపల్లిగూడెం అర్బన్ : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్ సీపీలోకి కూటమి నేతలు వలసలు కొనసాగుతున్నాయి. గురువారం పలు చోట్ల టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన నాయకులు వైఎస్సార్ సీపీలో చేరారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరిన గమిని సుబ్బారావు గురువారం సాయంత్రం ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణను గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గమినిని మంత్రి కొట్టు వైఎస్సార్ సీపీ కండువా వేసి సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మాజీ వైస్ చైర్యన్, వ్యాపారవేత్త గమిని సుబ్బారావు వైఎస్సార్ సీపీలో చేరడం శుభసూచకమన్నారు. ఆర్యవైశ్యులు ప్రశాతంగా వ్యాపారాలు చేసుకోవాలి, అందరితోను స్నేహంగా ఉండాలనే సదుద్దేశంతో ముందుకు వెళతారన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి నిర్వహిస్తున్న మేమంతా సిద్ధం బస్సు యాత్రకు ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారన్నారు. ఇది చూసిన కూటమి నేతలు అయోమయంలో ఉన్నారన్నారు. గమని సుబ్బారావు మాట్లాడుతూ వైఎస్సార్సిపి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పాలన చూసి ఆకర్షితులై జగన్ సమక్షంలో పార్టీలో చేరానన్నారు. ప్రజల భవిష్యత్తు జగన్మోహనరెడ్డి అని సుబ్బారావు అన్నారు. అప్సడా వైస్ ఛైర్మన్ వడ్డి రఘురాం మాట్లాడుతూ గమని సుబ్బారావు వంటి వ్యక్తులు వైఎస్సార్సిపిలోకి చేరడం సంతోషకరమన్నారు. తాడేపల్లిగూడెంలో కొట్టు సత్యనారాయణను ఎమ్మెల్యేగా గెలిపించేందుకు కృషి చేయాలని కోరారు. పాలకొల్లులో.. పాలకొల్లు సెంట్రల్: సీఎం వైఎస్ జగన్ పాలన మెచ్చే ఇతర పార్టీల నేతలు వైఎస్సార్ సీపీలో చేరుతున్నారని వైఎస్సార్ సీపీ పాలకొల్లు అసెంబ్లీ అభ్యర్థి గూడాల గోపి అన్నారు. పాలకొల్లులో గురువారం 18వ వార్డు టీడీపీ, జనసేన, బీజేపీలకు చెందిన 25 కుటుంబాలు వైఎస్సార్ సీపీలో చేరారు. వీరందరికి గుడాల గోపి వైఎస్సార్ పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. వార్డు ఇన్చార్జి రామాంజుల పెద్దమదు, ఖండవల్లి వాసుల సమక్షంలో పసుపులేటి రమేష్, పసుపులేటి సుధ, పసుపులేటి జాన్,కొండేటి హనోక్, పసుపులేటి దివ్య, పసుపులేటి రాజేష్, కౌంజు మరేష్, కొల్లి పాప, బెజవాడ లక్ష్మీ, కంకిపాటి శ్రీదర్, వడ్లపాటి పల్లంరాజు, తెన్నేటి రాజేష్బాబు, తానేటి బ్రూస్రామ్, కానూరి రమణ, అనపర్తి రవిబాబుల కుటుంబ సభ్యులు వైఎస్సార్ పార్టీలో చేరారు. సంచారజాతుల కార్పోరేషన్ చైర్మన్ పెండ్ర వీరన్న, యడ్ల తాతాజీ, గుమ్మాపు వరప్రసాద్, పాలపర్తి కృపానాథ్, సనమండ సురేష్, పసుపులేటి వీరాస్వామి, రామాంజు చిన్నమధు, కె.జక్కరయ్య, ఎం.జయరావు పాల్గొన్నారు. గుండుగొలనులో.. భీమడోలు: గుండుగొలనుకు చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు గురువారం రాత్రి వైఎస్సార్ సీపీ భీమడోలు మండల ఇన్చార్జి పుప్పాల కార్తీక్ ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీలో చేరారు. ఐదేళ్లలో సీఎం వైఎస్ జగన్ పేదలకు అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు తమను ఎంతగానో ఆకర్షించాయని, అందుకే టీడీపీని వీడి వైఎస్సార్ సీపీలో చేరుతున్నామని వారంతా ప్రకటించారు. ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు గ్రామాన్ని అభివృద్ధి చేశారని, సొంతింటి కలను సాకారం చేశారన్నారు. అనంతరం పుప్పాల కార్తీక్ సమక్షంలో టీడీపీకి చెందిన వెలగల కృష్ణ, పి.సతీష్, పి.ప్రసాద్, రెడ్డి ప్రసాద్, విశాఖ పవన్, విశాఖ రంగ, గోంగాడ శివ, గుమ్మడి దుర్గారావు, ఆళ్ల దుర్గారావు, ఆళ్ల హేమంత్ తదితరులకు పార్టీ కండువాలను వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. రానున్న ఎన్నికల్లో ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు, ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ యాదవ్లను గెలిపించేందుకు యుద్ద సైనికుల్లా పని చేయాలని కార్తీక్ వారిని కోరారు. గ్రామ పార్టీ అధ్యక్షుడు ముదుండి సూర్యనారాయణరాజు, నాయకులు జహీర్, పసుపులేటి శ్రీను, వార్డు సభ్యుడు గొటికల మురళీ, నాయకులు నల్ల శ్రీను, మర్రాపు బాబు, వగ్వాల రామన్ పాల్గొన్నారు.
Advertisement
Photos
View allVideo
View allహైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో ప్రముఖ నటుడు అరెస్ట్
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో ప్రముఖ నటుడు అరెస్ట్
- కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
- కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
- ప్రజా సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావిస్తా
- రెచ్చిపోయిన రౌడీ మూకలు
- కొత్త ఇంట్లోకి 'జబర్దస్త్' కమెడియన్.. వీడియో వైరల్
- హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
- Rishabh Pant: భారీ ప్రమాదం నుంచి మైదానం వరకు..
- స్టార్ హీరోయిన్ నుంచి కాంట్రవర్సీల వరకు.. సమంత గురించి ఇవి తెలుసా?
- అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
What’s your opinion
is snake reptile?
What is your fav car
ముంబై కెప్టెన్గా హార్దిక్ పాండ్యా నియామకం సరైందేనా?
AP : కూటమి మ్యానిఫెస్టోపై ఏమనుకుంటున్నారు?
నమ్మశక్యం కాని వాగ్దానాలిస్తారు
ఏ పార్టీకి నచ్చిన వాగ్దానాలు వారిస్తారు
Advertisement