రాజన్న ధర్మకర్తల మండలికి నోటిఫికేషన్‌ | notification issude the vemulawada trust | Sakshi
Sakshi News home page

రాజన్న ధర్మకర్తల మండలికి నోటిఫికేషన్‌

Aug 9 2016 6:58 PM | Updated on Sep 4 2017 8:34 AM

రాజన్న ధర్మకర్తల మండలికి నోటిఫికేషన్‌

రాజన్న ధర్మకర్తల మండలికి నోటిఫికేషన్‌

వేములవాడ రాజన్న ధర్మకర్తల మండలి నియామకానికి ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఈ నెల 6న విడుదలైన జీవో 349 అనుసారం 20 రోజుల్లోగా ఆసక్తిగలవారు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి, కమిషనర్‌తోపాటు రాష్ట్రంలోని 34(6ఏ టెంపుల్స్‌) దేవాలయాల ఈవోలకు ఈ సమాచారాన్ని చేరవేసినట్లు ఇందులో పేర్కొన్నారు.

  • 20 రోజుల్లోగా దరఖాస్తులకు ఆహ్వానం
  • వేములవాడ: వేములవాడ రాజన్న ధర్మకర్తల మండలి నియామకానికి ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఈ నెల 6న విడుదలైన జీవో 349 అనుసారం 20 రోజుల్లోగా ఆసక్తిగలవారు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి, కమిషనర్‌తోపాటు రాష్ట్రంలోని 34(6ఏ టెంపుల్స్‌) దేవాలయాల ఈవోలకు ఈ సమాచారాన్ని చేరవేసినట్లు ఇందులో పేర్కొన్నారు. అయితే ఇందుకు సంబంధించిన నియమ నిబంధనలను మాత్రం ప్రకటించకపోవడంతో టీఆర్‌ఎస్‌ నాయకులు అధికారులను సంప్రదిస్తున్నారు. గతంలో డిగ్రీ అర్హత ఉండాలని ఒక నిబంధన విధించారని, ఆ నిబంధన మేరకు అర్హత అడుగుతారా? లేక ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఆశావహులు ఆలోచనలో పడ్డారు. ట్రస్టుబోర్డు సభ్యుల సంఖ్య సైతం ప్రకటించకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని రాజన్న ఆలయం, ధర్మపురి ఆలయాలకు ఈ నోటిఫికేషన్‌ విడుదలైంది. దీంతో దరఖాస్తు చేసుకునేందుకు ఆశావహులు ప్రణాళికలు వేసుకుంటున్నారు. ఎమ్మెల్యే రమేశ్‌బాబు జర్మనీకి వెళ్లడంతో ఆయన రాకకోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఆలయ అధికారులు ధర్మకర్తల మండలి ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement