నల్గొండ జిల్లాలో తొమ్మిది గ్రామ పంచాయతీలకు అధికార టిఆర్ఎస్ పార్టీ ఐదు, కాంగ్రెస్ పార్టీ నాలుగు స్థానాలను కైవసం చేసుకున్నాయి.
నల్గొండ: నల్గొండ జిల్లాలో తొమ్మిది గ్రామ పంచాయతీలకు అధికార టిఆర్ఎస్ పార్టీ ఐదు, కాంగ్రెస్ పార్టీ నాలుగు స్థానాలను కైవసం చేసుకున్నాయి. నకిరేకల్ మేజర్ గ్రామ పంచాయతీతో పాటు చందంపల్లి, కడపర్తి, అమ్మనబోలును కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మానాయికుంట, చందూపట్ల, తాటికల్, నేల్లిబండ, నోముల గ్రామ పంచాయతీలను టిఆర్ఎస్ దక్కించుకుంది. గ్రామ పంచాయతీలలో కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్కు గట్టి పోటినిచ్చింది.