అలరించిన సంగీత నృత్యరూపకం | musical programme in prasanthi nilayam | Sakshi
Sakshi News home page

అలరించిన సంగీత నృత్యరూపకం

Feb 23 2017 10:47 PM | Updated on Sep 5 2017 4:26 AM

అలరించిన సంగీత నృత్యరూపకం

అలరించిన సంగీత నృత్యరూపకం

శివరాత్రి పర్వదిన వేడుకలను పురస్కరించుకుని సత్యసాయి సన్నిధిలో విద్యార్థులు నిర్వహించిన ‘జగతే పితర వందే’ సంగీత నృత్యరూపకం భక్తులను అలరించింది.

పుట్టపర్తి టౌన్‌ : శివరాత్రి పర్వదిన వేడుకలను పురస్కరించుకుని సత్యసాయి సన్నిధిలో విద్యార్థులు నిర్వహించిన ‘జగతే పితర వందే’ సంగీత నృత్యరూపకం భక్తులను అలరించింది. గురువారం సాయంత్రం సాయికుల్వంత్‌ సభా మందిరంలో సత్యసాయి మహాసమాధి చెంత ప్రశాంతి డ్యాన్స్‌ ట్రూప్‌ సభ్యులు సంగీత నృత్యరూపకం ప్రదర్శించారు. ఇందులో భాగంగా పరమశివుని వైభవాన్ని, వినాయకుడు తన మాతృమూర్తులపై ప్రదర్శించిన భక్తిభావనను చక్కగా వివరించారు.

నేడు ప్రశాంతి నిలయంలో అఖండ భజన
శివరాత్రి పర్వదిన వేడుకల్లో భాగంగా ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంత్‌ సభా మందిరంలో సత్యసాయి మహాసమాధి చెంత  శుక్రవారం సాయంత్రం 6 గంటలకు అఖండ భజన ప్రారంభం కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement