గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం | Missing person's body is available | Sakshi
Sakshi News home page

గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం

Jul 31 2016 12:39 AM | Updated on Sep 4 2017 7:04 AM

తాడ్వాయి మండలం మేడా రం జంపన్నవాగులో ఈ నెల 24న స్నానం చేస్తూ ప్రమాదవశాత్తు వాగులో పడి గల్లంతైన గూటోజు శ్రీధర్‌కుమార్‌(36) మృతదేహం ఏటూరునాగారం మండల కేంద్రంలోని జంపన్నవాగు బ్రిడ్జి వద్ద కనిపించింది.

 ఏటూరునాగారం : తాడ్వాయి మండలం మేడా రం జంపన్నవాగులో ఈ నెల 24న స్నానం చేస్తూ ప్రమాదవశాత్తు వాగులో పడి గల్లంతైన గూటోజు శ్రీధర్‌కుమార్‌(36) మృతదేహం ఏటూరునాగారం మండల కేంద్రంలోని జంపన్నవాగు బ్రిడ్జి వద్ద కనిపించింది. రేగొండ మండలం మడతపల్లికి చెందిన శ్రీధర్‌ ములుగురోడ్డులో ఫర్నీచర్‌ వర్క్‌ చేసుకుంటూ కుటుంబం తో వరంగల్‌లో నివాసముంటున్నారు. కుటుంబ సభ్యులతో మేడారం సమ్మక్క–సారలమ్మ వనదేవతలను దర్శించుకునేందుకు ఆయన వచ్చారు. ప్రమాదవశాత్తు జంపన్నవాగులో పడి గల్లంతయ్యాడు. ఆరు రోజుల అనంతరం మృతదేహం ఏటూరునాగారంలో తే లింది. సంఘటన స్థలానికి చేరుకున్న మృతుడి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement