భార్య పుట్టింటికి వెళ్లిందని.. | Man commits suicide worried about wife | Sakshi
Sakshi News home page

భార్య పుట్టింటికి వెళ్లిందని..

Jun 13 2016 8:40 PM | Updated on Sep 4 2017 2:23 AM

భార్య పుట్టింటికి వెళ్లిందని మనస్తాపానికి గురైన ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

పాల్వంచ(ఖమ్మం): భార్య పుట్టింటికి వెళ్లిందని మనస్తాపానికి గురైన ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా పాల్వంచ మండలం నాగారంలో సోమవారం రాత్రి వెలుగుచూసింది. గ్రామానికి చెందిన పి. శ్రీను(26)కు రెండేళ్ల క్రితం వివాహమైంది.

ఈ మధ్య కాలంలో తాగుడికి బానిసైన శ్రీను భార్యతో గొడవపడుతుండటంతో.. విసిగి వేసారిన ఆమె ఈ రోజు పుట్టింటికి వెళ్లింది. దీంతో మనస్తాపానికి గురైన శ్రీను పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement