Sakshi News home page

కాపునేతల అరెస్టుకు నిరసనగా రాస్తారోకో

Published Sat, Feb 6 2016 1:17 PM

కాపునేతల అరెస్టుకు నిరసనగా రాస్తారోకో - Sakshi

గుంటూరు జిల్లా: గుంటూరులో శనివారం ఉదయం కాపు నేతలను పోలీసులు అరెస్ట్ చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. చేబ్రోలు పోలీస్ స్టేషన్ ఎదుట నాయకులు రాస్తారోకో నిర్వహించారు. అరెస్ట్ చేసిన నేతలను వెంటనే విడుదల చేయాలని కాపు నాయకులు డిమాండ్ చేశారు. పోలీసులకు, నాయకులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కాపులను బీసీలలో చేర్చాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేస్తున్న ఆమరణ దీక్ష రెండో రోజు కొనసాగుతోంది.

Advertisement
Advertisement