ఏజెన్సీలో వై.ఎస్‌. జగన్‌ పర్యటన ఖరారు | jagan tour east godavari | Sakshi
Sakshi News home page

ఏజెన్సీలో వై.ఎస్‌. జగన్‌ పర్యటన ఖరారు

Jun 27 2017 11:30 PM | Updated on Aug 8 2018 5:51 PM

ఏజెన్సీలో వై.ఎస్‌. జగన్‌ పర్యటన ఖరారు - Sakshi

ఏజెన్సీలో వై.ఎస్‌. జగన్‌ పర్యటన ఖరారు

సాక్షి ప్రతినిధి, కాకినాడ: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఏజెన్సీ పర్యటన ఖరారైందని పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు మంగళవారం రాత్రి వెల్లడించారు. ఈ నెల 30వ తేదీ రాత్రికి జిల్లాకు చేరుకుంటారని, జూలై 1వ తేదీన

– జూలై 1న చాపరాయిలో పర్యటన
 – జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు వెల్లడి
సాక్షి ప్రతినిధి, కాకినాడ:  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఏజెన్సీ పర్యటన ఖరారైందని పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు మంగళవారం రాత్రి వెల్లడించారు. ఈ నెల 30వ తేదీ రాత్రికి జిల్లాకు చేరుకుంటారని, జూలై 1వ తేదీన విష జ్వరాలతో అల్లాడుతున్న చాపరాయి, ఇతర గ్రామాలను సందర్శించి మృతుల కుటుంబాలను జగన్‌ పరామర్శిస్తారని తెలిపారు. అక్కడి పరిస్థితులు, గిరిజనులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, నెలకున్న సమస్యల్ని బాధిత కుటుంబాలు, స్థానికులతో జగన్‌ మాట్లాడి తెలుసుకుంటారన్నారు.   
చాపరాయి ఘటనపై జగన్‌ ఆరా...
 వై.రామవరం మండలం చాపరాయి ఘటనపై జగన్‌ మోహన్‌రెడ్డి వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబుతో మాట్లాడారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితులు, అందుతున్న వైద్యసేవలను అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలు, బాధితులకు న్యాయం జరిగేలా పార్టీ అండగా నిలవాలని ఆయన కోరారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement