వ్యాపారులు, డీలర్ల సౌలభ్యం కోసం కర్నూలు నగరంలోని ఎన్ఆర్ పేటలో ఉన్న సెంట్రల్ ఎక్సైజ్ డివిజన్ ఆఫీసులో జీఎస్టీ సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆ శాఖ అడిషనల్ కమిషనర్ టి.ముత్తుస్వామి చెప్పారు.
కర్నూలులో జీఎస్టీ సేవా కేంద్రం
Mar 22 2017 12:41 AM | Updated on Sep 5 2017 6:42 AM
కర్నూలు (హాస్పిటల్): వ్యాపారులు, డీలర్ల సౌలభ్యం కోసం కర్నూలు నగరంలోని ఎన్ఆర్ పేటలో ఉన్న సెంట్రల్ ఎక్సైజ్ డివిజన్ ఆఫీసులో జీఎస్టీ సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆ శాఖ అడిషనల్ కమిషనర్ టి.ముత్తుస్వామి చెప్పారు. మంగళవారం సుంకేసుల రోడ్డులోని ఓ హోటల్లో జీఎస్టీపై సెంట్రల్ ఎక్సైజ్ అండ్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ కమిషనర్ ముత్తుస్వామి మాట్లాడుతూ జీఎస్టీ సేవా కేంద్రంలో వ్యాపారులు వారి అనుమానాలు నివృత్తి చేసుకోవచ్చన్నారు. జీఎస్టీ వల్ల వ్యాపారులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. కార్యక్రమంలో సెంట్రల్ ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ టి.సెంథిల్ మురుగన్, చాంబర్ ఆఫ్ కామర్స్ జిల్లా అధ్యక్షుడు విజయ్కుమార్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement