బాలికతో భర్త కలిసుండటం చూసి.. | girl murder | Sakshi
Sakshi News home page

బాలికతో భర్త కలిసుండటం చూసి..

Jul 20 2016 9:36 AM | Updated on Jul 30 2018 8:29 PM

బాలికతో భర్త కలిసుండటం చూసి.. - Sakshi

బాలికతో భర్త కలిసుండటం చూసి..

తాళ్లపొలంలో గత నెల ఏడున అనుమానాస్పదంగా మరణించిన పప్పుల ఆదిలక్ష్మిది హత్యేనని ప్రత్యేక దర్యాప్తు అధికారి, కాకినాడ డీఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు తెలిపారు.

రామచంద్రపురం : తాళ్లపొలంలో గత నెల ఏడున అనుమానాస్పదంగా మరణించిన పప్పుల ఆదిలక్ష్మిది హత్యేనని ప్రత్యేక దర్యాప్తు అధికారి, కాకినాడ డీఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు తెలిపారు. మంగళవారం విలేకరులకు వివరాలు చెప్పారు. గ్రామానికి చెందిన కట్టా రాధాకృష్ణ, ఇదే గ్రామానికి చెందిన 8 ఏళ్ల బాలికను ఇంటిలో పనిచేసేందుకు తల్లిదండ్రుల వద్ద ఒప్పందం కుదుర్చుకున్నాడు. బాలికను పాఠశాలలో చేర్పించి చదివించేందుకు, పెద్దయ్యాక పెళ్లి చేసేలా మాట్లాడుకున్నారు. బాలికను 7వ తరగతి వరకు చదివించిన రాధాకృష్ణ, ఆ తర్వాత స్కూల్‌కు పంపలేదు. ఏడాదిన్నర క్రితం నుంచి బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనారోగ్యంగా ఉన్న తన భార్య అన్నపూర్ణను గత నెల 7న రాధాకృష్ణ కాకినాడ వెళ్లి రాత్రికి తిరిగి వచ్చారు.

భార్య నిద్రపోయాక రాధాకృష్ణ ఆ బాలికతో కలిసి ఉండగా, అదే సమయంలో మెలకువ వచ్చిన ఆదిలక్ష్మి వారిని గమనించింది. భర్తతో, బాలికతో ఆమె గొడవకు దిగింది. ఈ క్రమంలో భార్యాభర్తలు కలిసి బాలికను కొట్టడంతో ఆమె అపస్మారక స్థితికి చేరింది. ఈ విషయం బయటకు తెలిస్తే తమ పరువు పోతుందని భావించిన రాధాకృష్ణ తన భార్యతో కలిసి ఇంటిలోనే బాలికను హతమర్చారు. గ్రామానికి చెందిన రాధాకృష్ణ అనుచరుడు పంపన త్రిమూర్తులు సహకారంతో, ఆ బాలిక ఇంటిలో ఉరివేసుకున్నట్టు చిత్రీకరించారు. కేసు దర్యాప్తులో వాస్తవాలు వెలుగుచూడడంతో, నిందితులు వీఆర్వో వద్ద మంగళవారం లొంగిపోయారు. రామచంద్రపురం డీఎస్పీ ఎన్‌బీఎం మురళీకృష్ణ, సీఐ పి.కాశీవిశ్వనాథ్, ఎస్సైలు ఫజల్‌ రహ్మాన్, ఎల్‌.శ్రీనునాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement