టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్కతో ప్రజా గాయకుడు గద్దర్ శనివారం సమావేశమయ్యా రు.
రాజకీయ పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణపై చర్చ
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్కతో ప్రజా గాయకుడు గద్దర్ శనివారం సమావేశమయ్యా రు. భట్టి నివాసంలో గద్దర్తో జరిగిన ఈ సమావేశంలో టీపీసీసీ నేతలు అద్దంకి దయాకర్, బెల్లయ్య నాయక్, రేగ కాంతారావు ఉన్నారు. సుమారు నాలుగు గంటలకు పైగా జరిగిన ఈ భేటీలో తెలంగాణ ఏర్పాటుకు ముందు, తెలంగాణ ఏర్పాటైన తర్వాత పాల నలో వచ్చిన మార్పులు, సమకాలీన రాజకీ య పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణ వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.
తెలంగాణలో సామాజిక న్యాయంజరుగుతుందని, సమస్యలుపరిష్కారం అవుతాయనిభావిస్తే మార్పేమీరాలేదని గద్దర్ అభిప్రాయపడినట్టు గా తెలిసింది. రైతులు, విద్యార్థులు, దళితులు, కళాకారులు, ఉద్యోగులు రాష్ట్రంలో అసంతృప్తి గా ఉన్నారని వ్యాఖ్యానించినట్టు సమాచారం. రాష్ట్రంలో బడుగు వర్గాలు రాజకీయ అధికారం సాధించుకోవడానికి కాంగ్రెస్ దగ్గరున్న కార్యా చరణ ప్రణాళిక ఏమిటనే గద్దర్ ప్రశ్నించారు.
ప్రత్యామ్నాయ అభివృద్ధిపై చర్చ...
‘తెలంగాణ ఇచ్చారనే సానుభూతి, కృతజ్ఞతా భావం తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీపై ఉంది. ఎన్నికల్లో గెలవడానికి, అన్ని వర్గాలను సమీకరించడానికి అది మాత్రమే సరిపోదు. ఇప్పుడున్న టీఆర్ఎస్ను కాదని కాంగ్రెస్కి ప్రజలెందుకు ఓటేయాలి? దళితుడిని సీఎం చేస్తానని చెప్పిన కేసీఆర్ మాట తప్పారు. అందుకు కేసీఆర్ను తిట్టడమేనా? కాంగ్రెస్ దగ్గర అంతకు మించిన ప్రణాళిక ఏమన్నా ఉందా? కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు ఏంచేస్తుంది? ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళిక ప్రతిపాదిస్తుందా’అని గద్దర్ అడిగినట్టు తెలిసింది.
తెలంగాణ వస్తే అభివృద్ధి, సంక్షేమం, ప్రత్యామ్నాయ అభి వృద్ధి నమూనా, దళితులకు రాజ్యాధికారం సాధించడానికి మార్గాలు, కార్యాచరణ వంటివాటిపైనా పరస్పర అభిప్రాయాలను పంచుకున్నారు. తెలంగాణ సాధించడానికి ముందు ఏయే అంశాల్లో మార్పును ఆశించామో, వాటిని సాధించుకోవడానికి అనుసరించాల్సిన భవిష్యత్ రాజకీయ కార్యాచరణ ప్రణాళికపై చర్చించినట్టుగా టీపీసీసీ నాయకులు వెల్లడించారు.