ముద్రగడ అరెస్ట్కు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు పెల్లుబికుతున్నాయి.
ముద్రగడ అరెస్ట్కు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు పెల్లుబికుతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో నగర కాపునాడు ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కాపునాడు అధ్యక్షుడు మాట్లాడుతూ.. ‘ఇప్పటికే రంగాను కోల్పోయాం.. ముద్రగడను కోల్పోవడానికి సిద్ధంగా లేం.. ఆయనకు ఏమైనా అయితే.. సహించేదిలేద’ని హెచ్చారించారు. మరో వైపు ముద్రగడ అరెస్ట్కు నిరసనగా విజయవాడలోని పలు జంక్షన్లలో రాస్తారోకోలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు.