పేరున్న మీడియా సంస్థలో రిపోర్లమని పోజులిస్తూ అందినకాడికి అక్రమాలకు పాల్పడుతోన్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ముగ్గురు నకిలీ రిపోర్టర్ల అరెస్ట్
Nov 20 2016 3:09 PM | Updated on Aug 20 2018 4:27 PM
ఏటూరునాగారం(భూపాలపల్లి): పేరున్న మీడియా సంస్థలో రిపోర్లమని పోజులిస్తూ అందినకాడికి అక్రమాలకు పాల్పడుతోన్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లి గ్రామం నుంచి ఇసుక తరలిస్తున్న లారీ డ్రైవర్ల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న ముగ్గురు నకిలీ రిపోర్టర్లను గ్రామస్థులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఈ ముగ్గురు నకిలీలు మంగపేట మండలానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు.
Advertisement


