అవినీతి నిర్మూలన అందరి బాధ్యత | curreption Uproot is our responsibility | Sakshi
Sakshi News home page

అవినీతి నిర్మూలన అందరి బాధ్యత

Nov 3 2016 10:40 PM | Updated on Sep 4 2017 7:05 PM

మాట్లాడుతున్న పీపీ వెంకటేష్

మాట్లాడుతున్న పీపీ వెంకటేష్

అవినీతి నిర్మూలన అందరి బాధత ఉందని పవర్‌ గ్రిడ్‌ ఏజీఎం రామకృష్ణంరాజు అన్నారు.

కర్నూలు సిటీ : అవినీతి నిర్మూలన అందరి బాధత ఉందని పవర్‌ గ్రిడ్‌ ఏజీఎం రామకృష్ణంరాజు అన్నారు. గురువారం స్థానిక జి.పుల్లారెడ్డి ఇంజినీరింగ్‌ కాలేజీలో ఇంచార్జి ప్రిన్సిపాల్‌ వై.వి మోహన్‌ రెడ్డి అద్యక్షతన అవినీతి నిర్మూలన అవగహన వారోత్సవాల్లో భాగంగా పవర్‌ గ్రిడ్‌ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగహన సదస్సు ఏర్పాటు చేశారు. రామకృష్ణం రాజుతో పాటు, ఏసీబీ సీఐ కృష్ణారెడ్డి, పబ్లిక్‌ ప్రాసిక్యుటర్‌ వెంకటేష్‌ హాజరై మాట్లాడారు దేశంలో అవినీతి పెరిగి పోయిందని, దీని నియంత్రణకు ప్రధాని మోదీ చర్యలు తీసుకుంటున్నారన్నారు. విద్యార్థులు, యువత ప్రశ్నించే తత్వం పెంచుకోవాలన్నారు. అంతకముందు విద్యార్థులచేత అవినీతి నియంత్రణపై ప్రతిజ్ఞ చేయించారు. 
 
 

Advertisement
 
Advertisement
Advertisement