నేడు 'పశ్చిమ'లో పర్యటించనున్న చంద్రబాబు | chandrababu tour in west godavari district | Sakshi
Sakshi News home page

నేడు 'పశ్చిమ'లో పర్యటించనున్న చంద్రబాబు

Apr 23 2016 9:36 AM | Updated on Jul 28 2018 3:33 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు శనివారం పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు.

ఏలూరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు శనివారం పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. పెదవేగిలో పలు అభివృద్ధి పనులకు చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే పోలవరం ప్రాజెక్టు పనులను ఆయన పరిశీలించనున్నారు. వీటితోపాటు దెందులూరు నియోజకవర్గంలోని ముండూరు, జానంపేట వద్ద... పోలవరం కుడి కాల్వ పనులను చంద్రబాబు పరిశీలిస్తారు. అనంతరం నీరు - చెట్టు కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. సాయంత్రం గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుని... నేరుగా న్యూఢిల్లీకి వెళ్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement