బైక్‌ను ఢీకొన్న డీసీఎం | Byke Dcm Accident, Farmer dead | Sakshi
Sakshi News home page

బైక్‌ను ఢీకొన్న డీసీఎం

Aug 21 2016 8:47 PM | Updated on Apr 3 2019 7:53 PM

నర్సింహులు మతదేహం వద్ద రోదిస్తున్న బంధువులు - Sakshi

నర్సింహులు మతదేహం వద్ద రోదిస్తున్న బంధువులు

గట్టు : బైక్‌ను డీసీఎం ఢీకొనడంతో ఓ రైతు దుర్మరణం పాలయ్యాడు. గ్రామస్తుల కథనం ప్రకారం.. గట్టు మండలంలోని నందిన్నె కు చెందిన బోయ నర్సింహులు (36) వత్తిరీత్యా వ్యవసాయదారు.

– రైతు దుర్మరణం
– నందిన్నె సమీపంలో ఘటన
గట్టు : బైక్‌ను డీసీఎం ఢీకొనడంతో ఓ రైతు దుర్మరణం పాలయ్యాడు. గ్రామస్తుల కథనం ప్రకారం.. గట్టు మండలంలోని నందిన్నె కు చెందిన బోయ నర్సింహులు (36) వత్తిరీత్యా వ్యవసాయదారు. ఈయనకు భార్య కాంతమ్మతోపాటు ముగ్గురు కుమారులు ఉన్నారు. ఎప్పటిలాగే శనివారం ఉదయం బైక్‌పై శివారులోని తమ పొలానికి వెళ్లాడు. అదే రాత్రి అక్కడ పనులు ముగించుకుని ఇంటికి తిరుగు ప్రయాణమయ్యాడు. రాఘవేంద్ర పాఠశాల సమీపంలోకి చేరుకోగానే గద్వాల నుంచి రాయచూర్‌ వైపు అతివేగంతో వెళుతున్న డీసీఎం ఢీకొనడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన చుట్టుపక్కలవారు క్షతగాత్రుడిని హుటాహుటిన కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి రలించారు.
 
        అర్ధరాత్రి పరిస్థితి విషమించడంతో అక్కడి వైద్యుల సూచన మేరకు కర్నూలుకు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మతి చెందాడు. ఈ విషయమై ఆదివారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఏఎస్‌ఐ యాదిరెడ్డి కేసు దర్యాప్తు జరుపుతున్నారు. అనంతరం బాధిత కుటుంబాన్ని టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకుడు గట్టు తిమ్మప్ప, వాల్మీకి సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు బల్గెర నారాయణరెడ్డి, ఉపాధ్యక్షుడు రామునాయుడు తదితరులు పరామర్శించారు. ఈ సంఘటనతో బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరయ్యారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement