ఖమ్మం రూరల్: ఆ చిన్నారికి అది తొలి పుట్టినరోజు. జ్వరం రావడంతో వేడుకలు నిర్వహించలేదు. కానీ, ఆ రోజే అతడికి చివరిరోజైంది. గొంతులో అన్నం ముద్ద అడ్డుపడి శ్వాస ఆడక చిన్నారి మృతిచెందాడు. ఈ విషాదకర ఘటన కాచిరాజుగూడెం గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన వీర్ల గోవర్దన్, సునీత దంపతులకు ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు.
చిన్నకుమారుడు సందీప్ (1) రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. అప్పటి నుంచి ఏమీ తినడం లేదు. ఆదివారం సందీప్కు తల్లి సునీత అన్నం తినిపిస్తోంది. ఈ క్రమంలో అన్నం ముద్ద గొంతులో అడ్డుపడి శ్వాసతీసుకోవడానికి ఇబ్బందిపడ్డాడు. గమనించిన తల్లి కేకలు వేయడంతో కుటుంబ సభ్యులు వచ్చి చిన్నారిని చికిత్స నిమిత్తం ఖమ్మం పట్టణానికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతిచెందాడు. ఆదివారం రోజునే సందీప్ పుట్టిన రోజు కావడం, అదే రోజు అతడు మృతిచెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వారిని ఓదార్చడం అక్కడివారికి సాధ్యపడలేదు.
గొంతులో అన్నం ముద్ద అడ్డుపడి..
Published Mon, Aug 1 2016 10:25 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement