వేగంగా వస్తున్న రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్న సంఘటనలో ఓ యువకుడు దుర్మరణం చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
నర్వ: వేగంగా వస్తున్న రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్న సంఘటనలో ఓ యువకుడు దుర్మరణం చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన శనివారం రాత్రి ఆత్మకూరు మండలం ఖానాపురం గేట్ సమీపంలో చోటు చేసుకుంది. ఆత్మకూరు మండలం నందిమళ్లకి చెందిన శ్రీను(26) హిటాచి డ్రైవర్గా పనిచేస్తున్నాడు. నర్వ మండలం ఈర్లదిన్నెకు చెందిన దిలీప్తో కలిసి శ్రీను ఆత్మకూర్లో తమ హిటాచి వాహనానికి చెందిన బ్యాటరీలను మరమ్మతు చేయించుకునేందుకు బైక్పై బయల్దేరారు. సాయంత్రం బ్యాటరీలు మరమ్మతులు చేయించుకుని ఈర్లదిన్నెకు తిరుగు ప్రయాణమయ్యాడు.