జేఎన్టీయూ: జేఎన్టీయూ అనంతపురంలోని పాలకభవనంలో బీటెక్ (బ్లెకింగ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ స్వీడన్), జేఎన్టీయూఏ సంయుక్తంగా అందిస్తున్న బీటెక్ కోర్సుల్లో ఆగస్టు 5న స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ ప్రొఫెసర్ విజయ్కుమార్ తెలిపారు. బీటెక్ సీఎస్ఈ, ఈసీఈ, మెకానికల్ బ్రాంచుల్లో చేరడానికి ఆసక్తి గల అభ్యర్థులు హాజరుకావాలన్నారు. ఫీజు తదితర పూర్తి వివరాలకు www.jntua.ac.inలో తెలుసుకోవచ్చన్నారు.
Related News by category
-
వైఎస్సార్ సీపీకి ఎన్నారైల మద్దతు
వరుపులకు సంఘీభావంగా ప్రచారం ఏలేశ్వరం: వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకి మద్దతుగా నియోజకవర్గంలో బుధవారం ఎన్నారైలు ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా నెదర్లాండ్కు చెందిన కార్తీక్, వంగా సారథిరెడ్డి, స్విట్జర్లాండ్కు చెందిన బ్రహ్మానందరెడ్డి, యూఎస్ఏ నుంచి కృష్ణారెడ్డి, ఐటీవింగ్స్ నుంచి సురేంద్ర, యస్వంత్ లింగంపర్తి గ్రామంలో రచ్చబండ నిర్వహించి సీఎం జగన్ పాలనలో చేసిన అభివృద్ధిపై ప్రజలకు వివరించారు. వారు మాట్లాడుతూ భూహక్కు చట్టంపై టీడీపీ అసత్య ప్రచారం చేయడం తగదన్నారు. రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ అధికారం చేపట్టిన నుంచి 70 మెడికల్ కళాశాలలు, 135 పరిశ్రమలు, నాలుగు పోర్టులు, రూ.13 లక్షల కోట్ల విలువచేసే పరిశ్రమల స్థాపనకు ఒప్పందం కుదరగా ఇప్పటివరకు రూ.2 లక్షల కోట్లు రాష్ట్రానికి వచ్చాయన్నారు. 19 లక్షల మందికి ఉపాధి కల్పించారన్నారు. నాడు–నేడులో భాగంగా 44 వేల పాఠశాలలను అభివృద్ధి చేశారన్నారు. అనంతరం వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావును కలుసుకుని సంఘీభావం తెలిపారు. పాలిసెట్ ఫలితాలు విడుదల బాలాజీచెరువు: పాలిటెక్నిక్ డిప్లమా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పాలిసెట్–2024 పరీక్ష ఫలితాలు బుధవారం అమరావతిలో విడుదల చేశారు. గత నెల 27వ తేదీన జిల్లావ్యాప్తంగా కాకినాడ కేంద్రంగా 27 కేంద్రాలలో పరీక్ష నిర్వహించారు. పరీక్షకు 8,845 మంది విద్యార్థులు హాజరుకాగా 7,590 ఉత్తీర్ణులయ్యారు. వీరిలో బాలురు 5,144 అభ్యర్థులకు 4,304 మంది, బాలికలు 3,702కు 3,286 మంది ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణత శాతం 85.81గా నమోదు కాగా బాలికలు 88.76 శాతం, బాలురు 83.69 శాతం సాధించారు. -
ఉపాధి అడుగులు.. పారిశ్రామిక పరుగులు
పిఠాపురం: ఉపాధి అవకాశాలు మెరుగు పడితేనే ఏ ప్రాంతమైనా అభివృద్ధి సాధిస్తుందని గట్టిగా నమ్మిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న పారదర్శక, వేగవంతమైన పారిశ్రామిక విధానాల కారణంగా కాకినాడ జిల్లా తీర ప్రాంతంలో పరిశ్రమలు పరుగులు పెడుతున్నాయి. తద్వారా యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతున్నాయి. ప్రభుత్వం తీసుకున్న పారిశ్రామిక విధానాలతో కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలి (కేఎస్ఈజెడ్) పెట్టుబడులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. 6,440 ఎకరాల్లో విస్తరించి ఉన్న కేఎస్ఈజెడ్కు రోడ్డు, రైలు, నౌకాయాన మార్గాల నిర్మాణం చురుగ్గా జరుగుతోంది. ఇప్పటికే పలు రొయ్యల శుద్ధి కర్మాగారాలు నెలకొల్పడంతో వేలాది మంది యువతకు, మహిళలకు ఉపాధి కలిగింది. నాడు బొమ్మలాట నాటి టీడీపీ హయాంలో సుమారు 12 ఏళ్ల పాటు రైతుల నుంచి సేకరించిన భూములను ఖాళీగా వదిలేశారు. ఊళ్లకు ఊళ్లను ఖాళీ చేయించి పునరావాస కాలనీకి తరలించి చేతులు దులుపుకున్నారు. ఆర్భాటంగా చైనాకు చెందిన ఒక కంపెనీతో బొమ్మల ఫ్యాక్టరీ ఒకటి పెట్టి పారిశ్రామికీకరణ అంటూ బాకాలు ఊదారు. తీరా చూస్తే అది కొంత కాలంలోనే మూత పడింది. అది తప్ప ఎస్ఈజెడ్లో ఏ ఒక్క పరిశ్రమ రాకుండా పోయింది. అటు భూములు కోల్పోయిన రైతులను నట్టేటముంచి ఇటు ఎటువంటి పరిశ్రమలు రాకుండా యువతకు ఉపాధి లేకుండా చేసిన ఘనత ఒక్క టీడీపీకే చెందుతుంది. నేడు పారిశ్రామిక బాట 2019 ఎన్నికలకు ముందు ప్రజా సంకల్పయాత్రలో జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్థానికుల విన్నపం మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే సెజ్లో పారిశ్రామికీకరణ వేగవంతం చేస్తానని, ఉపాధి అవకాశాలు మెరుగు పరుస్తానని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఒక పక్క సెజ్ రైతుల సమస్యను తీర్చడంతో పాటు మరో పక్క అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించి పరిశ్రమల స్థాపనకు విశేష కృషి చేశారు. దాని ఫలితంగా కేవలం నాలుగేళ్లలోనే సెజ్ ప్రాంతం పరిశ్రమలతో కళకళలాడుతోంది. ఇప్పటికే ఇక్కడ 10 వరకు రొయ్య శుద్ధి కర్మాగారాలు నెలకొల్పడంతో సుమారు 10 వేల మంది మహిళలకు ఉపాధి కలిగింది. రోడ్డు, రైలు, పోర్టు సౌకర్యాలు ఉండడంతో పారిశ్రామిక వేత్తలు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. పక్కనే తీర ప్రాంతం ఉండడంతో విదేశీ ఎగుమతులకు అనువుగా ఉంది. దీనికితోడు ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో ఇక్కడ పరిశ్రమలు పరుగులు పెడుతున్నాయి. ● 6,440 ఎకరాల్లో అరబిందో కాకినాడ స్పెషల్ ఎకనామిక్ జోన్ ● పారదర్శక విధానాలతో పెరిగిన పెట్టుబడులు ● రెండు వేల ఎకరాల్లో బల్క్ డ్రగ్ పార్కు ● రూ.2,500 కోట్ల వ్యయంతో శరవేగంగా గ్రీన్ ఫీల్డు పోర్టు నిర్మాణం ● 410 ఎకరాల విస్తీర్ణంలో రూ.4 వేల కోట్లతో పెన్సిలిన్, క్యూలే ఔషధాల తయారీ పరిశ్రమలు ● కాకినాడ నుంచి అన్నవరం వరకు రూ.1,480 కోట్ల వ్యయంతో భారత్మాల రోడ్డు మార్గం ● రూ.260 కోట్లతో అన్నవరం నుంచి కాకినాడకు 15 కిలోమీటర్ల ప్రత్యేక రైల్వే లైన్ ● ఉప్పునీటి నుంచి మంచినీటిని తయారు చేసే డిశాలినేషన్ వాటర్ ప్లాంట్ నిర్మాణం ● రూ.359 కోట్లతో 64 ఎకరాల్లో 400 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణం ● పలు రొయ్య శుద్ధి కర్మాగారాలు ● ప్రస్తుతం ఉపాధి పొందుతున్న కుటుంబాలు 10 వేలు 15 ఏళ్ల తరువాత తీరంలో పారిశ్రామికీకరణ కేఎస్ఈజెడ్లో వేలాది మందికి ఉపాధి అభివృద్ధి బాటలో తీర ప్రాంత గ్రామాలు పరిశ్రమల ప్రగతికి వీలుగా సూపర్ కనెక్టివిటీ రోడ్డు, రైలు, నౌకాయాన మార్గాల నిర్మాణం బారులు తీరుతున్న పారిశ్రామిక వేత్తలు వలస అనే ఊసు లేకుండా చేశారు నా పేరు బండి రాణి. మాది కొత్తపల్లి మండలం పొన్నాడ శివారు శీలంవారిపాలెం. నేను పొన్నాడ సర్పంచ్గా పని చేస్తున్నాను. మా పంచాయతీలో 19 శివారు గ్రామాలు ఉన్నాయి. వాటిలో కొన్ని సెజ్ భూసేకరణలో ఖాళీ చేసేశారు. మా గ్రామాల్లో వ్యవసాయ పనులు తప్ప వేరే ఉపాధిఉండేది కాదు. తీర ప్రాంతం కావడం వల్ల వ్యవసాయ పనులు కేవలం సీజన్లోనే ఉండేవి. దీంతో కేవలం మగవారు తప్ప ఆడవారికి ఉపాధి అనేది ఉండేది కాదు. ఉన్న భూములు సెజ్కు ఇవ్వడం వల్ల ఎస్ఈజెడ్ వచ్చినా ఒక్క పరిశ్రమ రాక నిరాశతో ఉండేవాళ్లం. ఉపాధి కోసం వలసలు వెళ్లాల్సి వచ్చేది. కాని సీఎం వైఎస్ జగన్ వచ్చాక సెజ్లో పరిశ్రమలు వచ్చేశాయి. మా గ్రామాల్లో మహిళలతో పాటు ఇతర ప్రాంతాల మహిళలకు ఉపాధి కలిగింది. ఇంటి పక్కనే పరిశ్రమలు రావడంతో మా గ్రామాల్లో మహిళలు ఇంటి, వంట పనితో పాటు ఉపాధి పొంది చేతి నిండా సంపాదించుకోవడం వల్ల వలసలు వెళ్లే పని లేకుండా పోయింది. గత టీడీపీ హయాంలో ఏవిధమైన ఆసరా లేక అల్లాడిన మా ప్రాంతం ప్రజలు ఇప్పుడు సుభిక్షంగా ఉంటున్నారు అంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన పారిశ్రామికీకరణ వల్లే అని బల్లగుద్ది చెబుతాం. – బండి రాణి, సర్పంచ్ పొన్నాడ, కొత్తపల్లి మండలం ఉపాధి నిచ్చే పరిశ్రమలే పెడుతున్నారు నా పేరు కంబాల మౌనిక. మాది కొత్తపల్లి మండలం మూలపేట. నేను మూలపేట గ్రామ సర్పంచ్గా పని చేస్తున్నాను. మా గ్రామస్తులు వ్యవసాయంతో పాటు చేపల వేట మీద ఆధారపడి బతుకుతారు. సెజ్ భూసేకరణ తరువాత మా గ్రామాల్లో ఉపాధి లేకుండా పోయింది. టీడీపీ హయాంలో భూములు తీసుకున్నారు తప్ప ఏ ఒక్క పరిశ్రమ స్థాపించలేక పోయారు. ఏళ్ల తరబడి భూములు ఖాళీగా వదిలేశారు. దీంతో మత్స్యకార కుటుంబాలు వలసలకు పోవాల్సి వచ్చేది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇక్కడ పరిశ్రమల స్థాపన ప్రారంభమైంది. ఇప్పటి వరకు ఏ పరిశ్రమ పెట్టినా వేలాది మందికి ఉపాధి కలిగేలా చూస్తున్నారు. మా గ్రామాల్లో ప్రజలకు చేతి నిండా పని దొరికింది. ఏ మత్స్యకార కుటుంబం వలస వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. ఇంత మార్పు వస్తుందని అనుకోలేదు. ఇది కేవలం జగన్ వల్లే సాధ్యమైందని ఘంటాపథంగా బెబుతాం. – కంబాల మౌనిక, సర్పంచ్, మూలపేట, కొత్తపల్లి మండలం -
ప్రత్యేకతల నెలవు పిఠాపురం
పాదగయ క్షేత్రంఫ చేనేత, మత్స్య సంపదకు ప్రసిద్ధి ఫ ఆధ్యాత్మికంగా పేరు ఫ వాణిజ్యపంటలకు నెలవు ఫ జంధానీ చీరలకు జన్మస్థలం పిఠాపురం: భౌగోళికంగా సముద్ర తీరప్రాంతాన్ని ఆనుకుని, ఆధ్యాత్మికంగా దేశంలోనే ఎంతో ప్రసిద్ధి చెందిన నియోజకవర్గం పిఠాపురం. ఈ నియోజకవర్గం పల్లపు భూములతో పాటు మెట్ట, సముద్ర ప్రాంతం కలిగి ఉంది. గోదావరి, ఏలేరు కాలువలపై ఆధారపడి పంటలు పండిస్తారు. ఇక్కడ వరి పంటతో పాటు, పత్తి, మిరప, ఉల్లి వంటి అనేక వాణిజ్య పంటలు పండుతాయి. ఎక్కువ వ్యవసాయ ఆధారిత ప్రాంతం. కొత్తపల్లి మండలంలో మత్స్యకారులు చేపల వేటపై ఆధారపడి జీవిస్తారు. ఇక్కడ చేపల వ్యాపారం రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందింది. ఇక్కడి చేనేత కార్మికుల చేతిలో రూపుదిద్దుకునే జాంధానీ చీరలకు అంతర్జాతీయంగా గుర్తింపు ఉంది. వ్యవసాయ రంగంలోనూ ప్రత్యేక గుర్తింపు కలిగి ఉంది. ప్రపంచంలో ఎక్కడా పండని పొట్టి మిర్చి ఇక్కడ పండిస్తారు. అన్ని రకాల కూరగాయలు పండించడంలో ఇక్కడి రైతులకు గుర్తింపు ఉంది. మత్స్య సంపద ఉత్పత్తిలో రాష్ట్రంలో పిఠాపురం నియోజకవర్గం ప్రథమ స్థానంలో ఉంది. రొయ్యపిల్లల ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి. ఉప్పాడలో మేజర్ హార్బర్ నిర్మాణం చివరి దశలో ఉంది. నియోజకవర్గ స్వరూపం పిఠాపురం నియోజకవర్గంలో కొత్తపల్లి, పిఠాపురం, గొల్లప్రోలు మండలాలతో పాటు పిఠాపురం మున్సిపాలిటీ, గొల్లప్రోలు నగర పంచాయతీ ఉన్నాయి. మొత్తం 51 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇవీ ప్రత్యేకతలు ఫ అష్టాదశ శక్తి పీఠాల్లో 10వదైన పురుహూతికా అమ్మవారు వెలసిన క్షేత్రం పిఠాపురం. ఫ దేశంలోని మూడు గయా క్షేత్రాల్లో ఒకటైన పాదగయ ఇక్కడే ఉంది. ఫ దత్తాత్రేయుని అవతారంగా భక్తులు భావించే శ్రీపాద శ్రీవల్లభ స్వామి జన్మస్థలం ఇది. ఇక్కడకు దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు మహారాష్ట్ర నుంచి వేలాదిగా భక్తులు వస్తూంటారు. ఫ దేశంలోని పంచమాధవ క్షేత్రాల్లో ఒకటైన కుంతీమాధవస్వామి ఆలయం ఉన్న దివ్యక్షేత్రం పిఠాపురం. ఫ ఉప్పాడ సాగరతీరం పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతోంది. ఫ తీర ప్రాంతంలో నిర్మించిన రొయ్య పిల్లల ఉత్పత్తి కేంద్రాలు పెద్ద మొత్తంలో విదేశీ మారకద్రవ్యాన్ని తెచ్చిపెడుతున్నాయి. ఫ నియోజకవర్గంలోని తీరప్రాంతంలో ఏటా రూ.150 కోట్ల మేర మత్స్యసంపద క్రయవిక్రయాలు జరుగుతుంటాయి. ఫ ఈ నియోజకవర్గం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతోంది. రవాణా మార్గాల అభివృద్ధితో వ్యాపార లావాదేవీలు భారీగా పెరిగాయి. 2019–23 మధ్య వివిధ పథకాల ద్వారా చేకూరిన లబ్ధి పథకం లబ్ధిదారులు నిధులు (రూ.కోట్లలో) వైఎస్సార్ పెన్షన్ కానుక 1,66,400 642.62 జగనన్న అమ్మ ఒడి 12,378 159.96 వైఎస్సార్ చేయూత 13,219 70.31 వైఎస్సార్ ఆసరా 2,340 124.53 వైఎస్సార్ రైతు భరోసా 12,413 8.84 ఇళ్ల స్థలాలు 16,906 వైఎస్సార్ సున్నా వడ్డీ 1,67,293 23.25 వైఎస్సార్ కాపు నేస్తం 4,557 49.72 వైఎస్సార్ నేతన్న నేస్తం 719 15.67 వైఎస్సార్ ఈబీసీ నేస్తం 992 4.77 వైఎస్సార్ బీమా 253 8.92 వైఎస్సార్ వాహనమిత్ర 1,012 9.40 రైతులకు ఇన్పుట్ సబ్సిడీ 5,175 14.26 సున్నా వడ్డీ పంట రుణాలు 1,917 1.86 జగనన్న విద్యా దీవెన 4,003 57.68 జగనన్న వసతి దీవెన 3,946 27.06 డీజిల్ సబ్సిడీ 6.00 జగనన్న చేదోడు 678 3.03 వైఎస్సార్ ఆరోగ్యశ్రీ 3,028 70.84 వైఎస్సార్ ఆరోగ్య ఆసరా 630 1.17 వైఎస్సార్ మత్స్యకార భరోసా 6,729 29.16 జగనన్న తోడు 7,411 16.65 వైఎస్సార్ సంపూర్ణ పోషణ 7,587 55.08 జగనన్న గోరుముద్ద 11,553 16.99 జగనన్న విద్యా కానుక 9,884 15.27 జగనన్న పాల వెల్లువ 436 3.98 వైఎస్సార్ యంత్ర సేవా పథకం 136 6.50 ఉచిత పంటల బీమా 4,273 34.62 పశునేస్త పరిహార పథకం 69 0.61 కంటి వెలుగు 28,722 85.32 వైఎస్సార్ పీఎంఏవై అర్బన్ 353 19.73 వైఎస్సార్ పీఎంఏవై గ్రామీణం 651 37.21 పీఎం స్వనిధి 914 5.56 జగనన్న జీవక్రాంతి 146 0.81ఓటర్ల వివరాలు మొత్తం ఓటర్లు : 2,30,048 పురుషులు : 1,15,223 సీ్త్రలు : 1,14,819 ఇతరులు : 4ఇప్పటి వరకూ గెలిచిన ఎమ్మెల్యేలు 1. రావు వెంకట జగ్గారావు (1952 – సీపీఐ) 2. వాడ్రేవు గోపాలకృష్ణ (1955 – ప్రజాపార్టీ) 3. పేకేటి తమ్మిరాజు (1960 – ప్రజాపార్టీ) 4. రావు భావనరావు (1962 – కాంగ్రెస్) 5. యాళ్ల నారాయణమూర్తి (1967, 1972 – కాంగ్రెస్) 6. కొప్పన మోహనరావు (1978–89 – కాంగ్రెస్) 7. వెన్నా నాగేశ్వరరావు ( 1983, 85, 94 – టీడీపీ) 8. సంగిశెట్టి వీరభధ్రరావు (1999 – ఇండిపెండెంట్) 9. పెండెం దొరబాబు (2004 – బీజేపీ) 10. వంగా గీత (2009 – ప్రజారాజ్యం) 11. ఎస్వీఎస్ఎన్ వర్మ (2014 – ఇండిపెండెంట్) 12. పెండెం దొరబాబు (2019 – వైఎస్సార్ సీపీ) -
పిడుగు పడి మేకల కాపరి మృతి
తాళ్లపూడి: మండలంలోని బల్లిపాడులో పిడుగు పడి మేకల కాపరి మృతి చెందిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. బల్లిపాడుకు చెందిన కవల నాగేశ్వరరావు(55) ఎప్పటి లాగే లంక భూముల్లో మేకలు మేపుతూ చెట్టు కింద ఉన్న సమయంలో పిడుగు పడి అక్కడికక్కడే మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు కొవ్వూరు పోలీసులు తెలిపారు. ఓటు వేసిన 12,329 మంది ఉద్యోగులు కాకినాడ సిటీ: జిల్లాలో మూడు రోజులుగా నిర్వహించిన పోస్టల్ బ్యాలెట్ పోలింగ్లో 12,329 మంది ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకున్నారని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జె.నివాస్ అన్నారు. కాకినాడ పీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరుగుతున్న తొలి రోజు జిల్లా స్థాయి పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ సరళిని ఆయన మంగళవారం పరిశీలించారు. ఫెసిలిటేషన్ సెంటర్లోని పోలింగ్ బూత్లను సందర్శించి, పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకుంటున్న ఉద్యోగులతో మాట్లాడారు. జిల్లాలో ఓటు హక్కు ఉండి, ఇక్కడే ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు ఈ నెల 4, 5, 6 తేదీల్లో ఆయా నియోజకవర్గాల్లో పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించామన్నారు. పొరుగు జిల్లాలో ఓటుహక్కు కలిగి, కాకినాడ జిల్లాలో విధులు నిర్వహిస్తున్న 4,179 మంది ఉద్యోగులకు మంగళ, బుధవారాల్లో పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పిస్తున్నామన్నారు. వీరి కోసం జిల్లా ఫెసిలిటేషన్ సెంటర్లో 13 పోలింగ్ బూత్లు, 11 వెరిఫికేషన్ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఒక్కో పోలింగ్ బూత్ను సుమారు 70 మంది ఓటర్లకు కేటాయించామని కలెక్టర్ నివాస్ తెలిపారు. కార్యక్రమంలో డీఆర్ఓ డి.తిప్పేనాయక్, జిల్లా పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారి జి.శ్రీనివాసరావు, సీపీఓ పి.త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు. ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం యువకుడి పరిస్థితి విషమం అన్నవరం: విశాఖ జిల్లా గాజువాకకు చెందిన ఒక ప్రేమ జంట స్థానిక లాడ్జిలో అత్మహత్యాయత్నం చేసింది. అయితే లాడ్జి యాజమాన్యానికి విషయం తెలిసి సకాలంలో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఆ జంటను తుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విశాఖ జిల్లా గాజువాకలోని ఒక షాపింగ్ మాల్లో పనిచేస్తున్న హర్షవర్ధన్, రాములమ్మ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. హర్షవర్ధన్ కు మరో అమ్మాయితో వివాహం అయింది. రాములమ్మ అవివాహిత. కాగా, వీరు సోమవారం రాత్రి అన్నవరంలోని లాడ్జికి వచ్చి తాము భార్యాభర్తలమని నమ్మించి గదిలో అద్దెకు దిగారు. మంగళవారం ఉదయం సిబ్బంది గదులు శుభ్రం చేస్తుండగా ఆ ప్రేమజంట ఉన్న గది తలుపు తీసి ఉంది. దాంతో అనుమానం వచ్చిన లాడ్జి సిబ్బంది గది లోపల చూడగా ఆ జంట మంచంపై అపస్మారక స్థితిలో ఉన్నారు. వారి పక్కన పురుగు మందు సీసా ఉండడంతో వెంటనే 108 అంబులెన్స్, పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వీరిని అంబులెన్స్లో తుని ప్రభుత్వాసుపత్రికి తరలించగా వారికి అక్కడ వైద్యులు చికిత్స చేశారు. వీరిలో హర్షవర్ధన్ పరిస్థితి విషమంగా ఉందని అన్నవరం ఎస్ఐ కిషోర్ తెలిపారు. ఎలాగా వివాహం చేసుకోలేదు, కలిసి చనిపోవాలని భావించి పురుగు మందు తాగినట్లుగా రాములమ్మ తెలిపినట్లు అన్నవరం ఎస్ఐ చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
సింహగర్జన
జన సంక్షేమ యజ్ఞానికి.. రాక్షసుల మాదిరిగా అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తూ.. నీచమైన కుట్రలకు పాల్పడుతున్న ‘పచ్చ’ నేతల తుచ్ఛ రాజకీయాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరుకొండలో ‘సింహ’గర్జన చేశారు. మహాప్రవాహంలా తరలివచ్చిన అశేష ప్రజానీకంలో తన వాక్ప్రవాహంతో చైతన్యం నింపారు. మరో ఆరు రోజుల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలు పేదల తలరాతల్ని మార్చేవని చెప్పారు. ఈ కురుక్షేత్ర మహాసంగ్రామంలో.. ఐదేళ్లుగా పసి బిడ్డ నుంచి పండు ముదుసలి వరకూ ప్రతి ఒక్కరి సంక్షేమానికి.. తరతరాలుగా అణగారిపోతున్న ప్రతి వర్గం అభివృద్ధికి పెద్ద పీట వేస్తున్న వైఎస్సార్ సీపీ అభ్యర్థుల్ని అఖండ మెజారిటీతో గెలిపించాలని.. విపక్ష కూటమి ఓటమి చెందేలా.. ప్రజలు ఇచ్చే తీర్పు చంద్రబాబు అండ్ కో నీతిమాలిన రాజకీయాలకు చెంపపెట్టు కావాలని పిలుపునిచ్చారు. కోరుకొండ సభకు అశేషంగా తరలివచ్చిన జనంలో ఒక భాగంజనవాహినికి సీఎం జగన్ అభివాదంఫ సీఎం జగన్ సభకు వెల్లువెత్తిన జనం ఫ అడుగడుగునా బ్రహ్మరథం ఫ కిక్కిరిసిన లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం రోడ్డు ఫ మండుటెండలోనూ జననేతపై చెక్కుచెదరని అభిమానం ఫ ఎన్నికలకు ‘మేమంతా సిద్ధం’ అంటూ నినదించిన ‘తూర్పు’ఫ మిన్నంటిన జై జగన్ నినాదాలు ఫ ీసఎం.. సీఎం.. అంటూ కేరింతలు ఫ వైఎస్సార్ సీపీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని జననేత అభ్యర్థన ఫ సభ గ్రాండ్ సక్సెస్ ఫ పార్టీ శ్రేణుల్లో జోష్చంద్రబాబుపై నిప్పులు చంద్రబాబు పాలనలో ప్రజలకు చేసిన మోసం, ప్రస్తుత ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు చేస్తున్న కుట్రలు, వంచనపై సీఎం జగన్ నిప్పులు చెరిగారు. ‘14 ఏళ్ల చంద్రబాబు పాలనలో ప్రజలు గుర్తుంచుకునేలా ఒక్క మంచి పనైనా జరిగిందా?’ అని ప్రశ్నించగా.. లేదంటూ ప్రజలు చేతులెత్తి మరీ సమాధానం చెప్పారు. ‘రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, ఆడబిడ్డకు మహాలక్ష్మి పథకం, ఇంటికో ఉద్యోగం అంటూ గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు.. అధికారంలో ఉన్నప్పుడు ఒక్కటైనా అమలు చేశాడా?’ అని అడగగా.. ‘చంద్రబాబు నమ్మద్రోహి.. బాబును నమ్మం’ అంటూ జనం నినాదాలు చేశారు. ‘ఫ్యాన్ గుర్తుకు ఓటేసేందుకు మీరంతా సిద్ధమా అని సీఎం జగన్ అడిగినప్పుడు.. ‘సిద్ధం.. సిద్ధం’ అంటూ ప్రజలు చేసిన నినాదాలతో కోరుకొండ గ్రామం హోరెత్తిపోయింది. సాక్షి, రాజమహేంద్రవరం: లక్ష్మీనరసింహ స్వామి వెలసిన కోరుకొండలో జగనోత్సాహం పెల్లుబికింది. జనసంక్షేమ, అభివృద్ధి ప్రదాత, ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహహన్రెడ్డి తమ చెంతకే వచ్చిన వేళ.. ఆ జననేతకు అశేష ప్రజానీకం అడుగడుగునా బ్రహ్మరథం పట్టింది. జై జగన్.. సీఎం.. సీఎం.. అంటూ పెద్ద పెట్టున నినదించింది. అభిమాన నేతను చూసిన క్షణంలో వారి ఉత్సాహం.. వరద వేళ కట్టలు తెగిన గోదారిలా ఉరకలు వేసింది. దీనికి తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కోరుకొండలో మంగళవారం జరిగిన ఎన్నికల ప్రచార సభ వేదికై ంది. ఈ సభలో సీఎం జగన్ ప్రసంగాన్ని చెవులారా వినేందుకు.. తమ అభిమాన నేతను కళ్లారా చూసేందుకు.. నియోజకవర్గంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు.. ఎర్రటి ఎండను సైతం లెక్క చేయకుండా వేలాదిగా తరలివచ్చారు. వృద్ధులు, మహిళలు, యువత, విద్యార్థులు, చిన్నారులు అనే తేడా లేకుండా వైఎస్సార్ సీపీ జెండాలు చేతబట్టి పెద్ద సంఖ్యలో కోరుకొండ చేరుకున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే జిల్లాలోని అన్ని దారులూ కోరుకొండ వైపే దారి తీశాయి. ఉదయమే సభా ప్రాంగణానికి చేరుకున్న జనవాహినితో కోరుకొండ లక్ష్మీనరసిహస్వామి ఆలయం రోడ్డు కిక్కిరిసిపోయింది. రోడ్డు పైనే కాదు.. చెట్లు, చుట్టుపక్కల భవనాలు.. ఇలా ఎక్కడ చూసినా జనమే దర్శనమిచ్చారు. సీఎం వైఎస్ జగన్ సభాస్థలికి చేరుకోగానే వృద్ధులు వైఎస్సార్ సీపీ జెండాలు చేత పట్టుకుని ఒక్కసారిగా ఆనందంతో నృత్యాలు చేశారు. జనం ఈలలు, కేరింతలు, చప్పట్లతో సభా ప్రాంగణాన్ని హోరెత్తించారు. ‘రాజానగరం సి ద్ధమా..!’ అని సీఎం జగన్ పిలుపునివ్వగానే ‘మేమంతా సిద్ధం’ అంటూ ముక్తకంఠంతో ప్రతిస్పందించారు. ఆకట్టుకున్న ప్రసంగం సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరుకొండ సమీపంలోని కాపవరం వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు ఉదయం 11 గంటలకు చేరుకున్నారు. ఆయనకు ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి సీఎం కోరుకొండ బహిరంగ సభా స్థలికి రోడ్డు మార్గంలో చేరుకున్నారు. ఆయనతో అశేష జనం.. ప్రవాహంలా కదిలారు. అడుగడుగునా ప్రజలు స్వాగతం పలికారు. రాజన్న బిడ్డను అక్కున చేర్చుకున్నారు. సభా స్థలికి 11.48 గంటలకు చేరుకున్న అనంతరం సీఎం జగన్ చేసిన ప్రసంగం అమితంగా ఆకట్టుకుంది. ఐదేళ్ల వైఎస్సార్ సీపీ పాలనలో చేపట్టిన సంక్షేమాన్ని వివరించిన ప్రతిసారీ ప్రజలు ఈలలు, కేకలతో సభను హోరెత్తించారు. ఫ ‘చంద్రబాబును నమ్మి ఓటేస్తే పథకాలన్నింటికీ ముగింపే’ అని సీఎం చెప్పినప్పుడు ప్రజలు అవునంటూ ప్రతిస్పందించారు. ఫ ‘చంద్రబాబును నమ్మడమంటే కొండచిలువ నోట్లో తల పెట్టడమే’ అనగానే.. ఆయనను నమ్మబోమని చేతులు ఊపుతూ మరీ ప్రజలు సీఎం జగన్కు మద్దతు తెలిపారు. ఫ చంద్రబాబు చేసిన మోసాలను వివరించిన ప్రతిసారీ ‘మళ్లీ బాబు పాలన వద్ద’ంటూ జనం పెద్ద పెట్టున స్పందించారు. ఫ ‘గతంలో ఏ ప్రభుత్వమైనా బటన్లు నొక్కి నేరుగా మీ ఖాతాల్లోకి సంక్షేమ ఫలాలు అందించిందా?’ అని జగన్ ప్రశ్నించినప్పుడు లేదు లేదంటూ జనం నినదించారు. ‘59 నెలల మీ బిడ్డ పాలనలో బటన్ నొక్కి నేరుగా మీ ఖాతాల్లో రూ.2.70 లక్షల కోట్లు జమ చేశాను’ అని చెప్పగానే ‘సీఎం.. సీఎం’ అంటూ మహిళలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తమ కుటుంబ సభ్యుడిగా భావించి అభిమానాన్ని చాటుకున్నారు. ఫ రాష్ట్రంలో 59 నెలల కాలంలో 2.31 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని సీఎం ప్రకటించినప్పుడు జేజేలు పలికారు. ఫ మేనిఫెస్టోలో చెప్పిన హామీల్లో 99 శాతం అమలు చేసి, అవి అమలయ్యాయా? లేదా? అని తెలుసుకునేందుకు పథకం పొందిన అక్కచెల్లెమ్మల ద్వారా టిక్కు పెట్టిస్తున్నామని చెప్పగానే.. ‘ఇచ్చిన మాట నెరవేర్చే సీఎం మీరేనన్నా’ అంటూ పలువురు భావోద్వేగానికి గురయ్యారు. ఫ ఆసరా, చేయూత, సున్నా వడ్డీ, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం పథకాల ద్వారా నా అక్కచెల్లెమ్మలు ఆర్థికాభివృద్ధికి బాటలు వేస్తున్నామని చెప్పగానే ప్రజలు హర్షధ్వానాలు చేశారు. ఫ నిరుపేదలకు 31 లక్షల ఇళ్లు మంజూరు చేసిన విషయాన్ని ప్రస్తావించగానే సొంతింటి కల నెరవేర్చిన జగనన్నకు జీవితాంతం రుణపడి ఉంటామని మహిళలు ఉద్వేగానికి గురయ్యారు. ఫ ‘అవ్వాతాతలకు ప్రతి నెలా రూ.3,000 పింఛన్ ఇంటి వద్దకు తెచ్చి ఇవ్వడం ఎప్పుడైనా జరిగిందా..’ అని సీఎం అడగగా.. ‘లేదు మనవడా’ అంటూ వృద్ధులు తమ ఆప్యాయత చూపారు. ఫ రైతుభరోసా, గ్రామ/వార్డు సచివాలయాలు, ఉచిత పంటల బీమా, మత్స్యకార భరోసా వంటివి అమలు చేస్తున్నట్లు జగన్ చెప్పగానే ఆయా వర్గాల ప్రజలు ‘జై జగన్’ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో తమకు చేకూరిన లబ్ధిని గుర్తు చేసుకున్నారు. అభ్యర్థుల పరిచయం సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తున్న వైఎస్సార్ సీపీ అభ్యర్థులను సీఎం జగన్ పరిచయం చేశారు. రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ గూడూరి శ్రీనివాస్, రాజానగరం ఎమ్మెల్యే అభ్యర్థిగా జక్కంపూడి రాజాలు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని, సౌమ్యులు, మంచి చేయాలనే తపన పడుతున్న వారు, మంచి మనసున్న వారిని భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఆద్యంతం ఉత్సాహంగా.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరుకొండ పర్యటన ఆద్యంతం ఉత్సాహంగా, విజయవంతంగా జరిగింది. ‘జై జగన్.. జైజై జగన్.. సీఎం.. సీఎం.. హల్లో ఏపీ.. వన్స్ మోర్ వైసీపీ..’ అంటూ యువత జెండాలు చేతబట్టి మరీ తమ అభిమానాన్ని చాటుకున్నారు. సభలో సీఎం ప్రసంగిస్తున్నంత సేపూ ఈలలు, నినాదాలు, కేరింతల హోరెత్తించారు. రెండు చేతులు పైకెత్తి సీఎం ప్రసంగానికి మద్దతుగా, చంద్రబాబు మోసాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రోడ్లపై ఎక్కడ చూసినా వైఎస్సార్ సీపీ జెండాలు చేతబట్టుకున్న అభిమానులు, కార్యకర్తలే దర్శనమిచ్చారు.
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వంటల ఘుమఘుమలతో కూడా కాలుష్యానికి ముప్పేనట
బుల్లితెర నటి పర్సనల్ వీడియో లీక్
బేర్ పంజా..భారీ నష్టాలతో ముగిసిన స్టాక్మార్కెట్ సూచీలు
వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే
బఠానీల ఉచిత దిగుమతి గడువు పెంపు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
టీడీపీ, బీజేపీ, జనసేన కుట్రతో పేదలకు నష్టం: సీఎం జగన్
రైతులను ఉద్దేశించి సీఎం జగన్ అద్భుత ప్రసంగం
సీఎం జగన్ మాస్ స్పీచ్ దద్దరిల్లిన కళ్యాణ దుర్గం
గుండెపోటుతో కన్నుమూసిన బీజేపీ కీలక నేత
Photos
View allVideo
View allతప్పక చదవండి
- వంటల ఘుమఘుమలతో కూడా కాలుష్యానికి ముప్పేనట
- రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..!
- బాబు, లోకేష్కు కొడాలి నాని స్ట్రాంగ్ కౌంటర్
- ముస్లింలకు రిజర్వేషన్లు ఉండాల్సిందే: సీఎం జగన్
- జనసేనకు గాజుగ్లాసు గుర్తుపై వెనక్కితగ్గిన టీడీపీ
- SRH: కాస్త ఓపిక పట్టు.. నీకూ టైమ్ వస్తుంది: యువీ పోస్ట్ వైరల్
- PK: 'పులుసు కారుతోంది'..!
- కేఎల్ రాహుల్పై లక్నో ఓనర్ ఫైర్.. చెప్పేది విను! వీడియో
- ప్రచారంలో సీనియర్ హీరో స్టెప్పులు!
- సీఎం నితీష్కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
Advertisement