వేముల(పులివెందుల): వేముల మండలం నల్లచెరువుపల్లెలో దారుణం జరిగింది. భార్య గొంతు కోసి.. తాను విషపు గుళికలు మింగి ఆత్మహత్య చేసుకున్నాడు. వీరి మరణంతో మూడేళ్ల చిన్నారి అనాథగా మారింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ప్రొద్దుటూరు మండలం లింగాపురం గ్రామానికి చెందిన కవిత(21)తో వేముల మండలం నల్లచెరువుపల్లె ఎస్సీ కాలనీకి చెందిన పరిగల రామాంజనేయులు(31)కి ఐదేళ్ల క్రితం వివాహమైంది. పెళ్లి అయిన ఏడాది పాటు వీరి కాపురం సజావుగా సాగింది. ఆ తర్వాత కుటుంబంలో కలహాలు మొదలయ్యాయి. దీంతో కొన్నాళ్ల పాటు వీరు అత్త ఊరైన లింగాపురంలోనే జీవనం సాగించారు. ఇటీవల సొంత గ్రామమైన నల్లచెరువుపల్లెకు చేరుకొని మృతుడి తల్లిదండ్రులు బ్రహ్మయ్య, ఓబుళమ్మతో కలిసి ఉన్నారు. సోమవారం రాత్రి కుటుంబ సభ్యులందరూ కలిసి భోజనం చేశారు. రామాంజనేయులు, కవిత ఇంట్లో నిద్రించగా.. బ్రహ్మయ్య, ఓబుళమ్మ, మనుమరాలు బ్రహ్మణి ఇంటి బయట నిద్రపోయారు. మంగళవారం తెల్లవారుజామున 2.16 గంటలకు మనుమరాలు బ్రహ్మణికి నీరు దప్పిక కావడంతో.. వారు పిలవగా లోపలి నుంచి ఎవరూ పలకలేదు. దీంతో అనుమానం వచ్చి గట్టిగా అరిచారు. అయినా ఫలితం లేకపోయింది. ఈ లోపే చుట్టు పక్కల వారు నిద్ర లేచి గుమికూడారు. ఇంటి ద్వారం వద్ద రక్తపు మడుగులో కవిత పడి ఉండటాన్ని గమనించారు. ఆమె గొంతు కోయబడింది. రామాంజనేయులు నోటి నుంచి బురగ కారుస్తూ పడి ఉండటాన్ని చూడారు. అప్పటికే వీరు మృతి చెందినట్లు గుర్తించారు.
అనాథగా మారిన చిన్నారి :
తల్లిదండ్రుల మరణంతో మూడేళ్ల కుమార్తె బ్రహ్మణి అనాథగా మారింది. తల్లిదండ్రులు చనిపోయిన విషయం సరిగా తెలియని ఆ చిన్నారి అమాయకంగా చూస్తూ.. ఏడుస్తుండటం అక్కడ ఉన్న వారిని కంటతడి పెట్టించింది. అయితే తమ కుమార్తె, అల్లుడును మృతుడి తల్లిదండ్రులు బ్రహ్మయ్య, ఓబుళమ్మతోపాటు సోదరుడు పవన్ కలిసి చంపారనే అనుమానం కింద మృతురాలి తండ్రి బాలరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నరేంద్రకుమార్ తెలిపారు.
ఆస్తి తగాదాలతోనే చంపారని ఆరోపణ :
తన కుమార్తె కవితను అల్లుడు రామాంజనేయులు గొంతు కోసి చంపేసి.. విషపు గుళికలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించాడని మృతుడి కుటుంబ సభ్యులు చెబుతున్నారని మృతురాలి తండ్రి బాలరాజు పేర్కొన్నాడు. అయితే కొన్నాళ్లుగా ఆస్తి కోసం గొడవ పడుతున్నారని.. ఆస్తి పంచి ఇవ్వమంటే.. తల్లిదండ్రులు పట్టించుకోలేదని ఆయన ఆరోపించాడు. ‘మీ కుమార్తె, అల్లుడు చనిపోయారు’ అని మృతుడి సోదరుడు ఫోన్ చేసి చెప్పారని చెప్పాడు.
దారుణం
Published Tue, Jan 10 2017 11:58 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్వన్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- రగులుతున్న క్యాంపస్లు!
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్?
Advertisement