మహాత్ముని విగ్రహం కూల్చివేత దారుణం | Atrocity | Sakshi
Sakshi News home page

మహాత్ముని విగ్రహం కూల్చివేత దారుణం

Aug 6 2016 8:38 PM | Updated on Sep 4 2017 8:09 AM

మహాత్ముని విగ్రహం కూల్చివేత దారుణం

మహాత్ముని విగ్రహం కూల్చివేత దారుణం

రాష్ట్రంలో ఆలయాలు, మసీదులు, చర్చిలు, జాతీయనేతల విగ్రహాలలను విచ్చలవిడిగా కూల్చివేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు భాధ్యత వహించాలని రాష్ట్ర ఆర్య వైశ్యుల మహాసభ అధ్యక్షుడు జయంతి వెంకటేశ్వర్లు అన్నారు. ఇబ్రహీంపట్నంలో గాంధీవిగ్రహం తొలగించిన ప్రదేశాన్ని ఆయన శనివారం పరిశీలించారు.

ఇబ్రహీంపట్నం :
 రాష్ట్రంలో  ఆలయాలు, మసీదులు, చర్చిలు, జాతీయనేతల  విగ్రహాలలను విచ్చలవిడిగా కూల్చివేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు భాధ్యత వహించాలని రాష్ట్ర ఆర్య వైశ్యుల మహాసభ అధ్యక్షుడు జయంతి వెంకటేశ్వర్లు అన్నారు. ఇబ్రహీంపట్నంలో గాంధీవిగ్రహం తొలగించిన ప్రదేశాన్ని ఆయన శనివారం పరిశీలించారు. ఆ ప్రాంతంలో నిరసన తెలిపారు. స్థానిక నాయకులు, వైఎస్సార్‌ సీపీ రాష్ట్రఅధికార ప్రతినిధి జోగి రమేష్‌ వారికి గాంధీ విగ్రహం తొలగించటంలో సీఎం చంద్రబాబు, మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావులదే ప్రధాన పాత్ర అని వివరించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన నేతలకు ఈ ప్రభుత్వం పట్టించిన దుస్థితిపై ఆగ్రహం  వ్యక్తం చేశారు. మహాత్ముణ్ని  అర్ధరాత్రి హత్యచేసి మురికినీటిలో పడేయటం దారుణమన్నారు. మూడురోజుల్లో విగ్రహాన్ని నిర్మించాలని లేనిపక్షంలో ఆందోళన బాట పటతామని హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement