వైఎస్సార్ జిల్లా లక్కిరెడ్డిపల్లి మండల కేంద్రంలో పోలీసులు శుక్రవారం పెద్ద సంఖ్యలో క్రికెట్ బుకీలను అదుపులోకి తీసుకున్నారు.
లక్కిరెడ్డిపల్లి(వైఎస్సార్ జిల్లా):
వైఎస్సార్ జిల్లా లక్కిరెడ్డిపల్లి మండల కేంద్రంలో పోలీసులు శుక్రవారం పెద్ద సంఖ్యలో క్రికెట్ బుకీలను అదుపులోకి తీసుకున్నారు. ఇండియా -బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ కు సంబంధించి 16 మంది క్రికెట్ బుకీలను స్థానిక స్టేట్ బ్యాంకు సమీపంలో అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.42 వేల నగదుతో పాటు 20 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
దీంతో పాటు 8 సెల్ ఫోన్లు, ఒక టీవీని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండుకు తరలించామని పులివెందుల ఏఎస్పీ అంబురాజన్ తెలిపారు.