కరీంనగర్‌లో ప్రేమోన్మాది ఘాతుకం | woman brutally murdered in karimnagar district | Sakshi
Sakshi News home page

కరీంనగర్‌లో ప్రేమోన్మాది ఘాతుకం

Jun 15 2018 11:52 AM | Updated on Aug 21 2018 6:08 PM

woman brutally murdered in karimnagar district - Sakshi

కరీంనగర్‌ జిల్లాలో శుక్రవారం దారుణ ఘటన చోటు చేసుకుంది.

సాక్షి, కరీంనగర్‌: కరీంనగర్‌ జిల్లాలో శుక్రవారం దారుణ ఘటన చోటు చేసుకుంది. కలెక్టర్‌ కార్యాలయానికి ముందే ఓ యువతిని ప్రేమోన్మాది గొంతుకోసి హత్య చేశాడు. రక్తపు మడుగులో పడిఉన్న యువతిని స్థానికులు ఆస్పత్రికి తరలిస్తుండగా మధ్యలోనే ఆమె ప్రాణాలు కోల్పోయింది. నిందితుడిని స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

మృతురాలి వివరాలు తెలుసుకున్న పోలీసులు ఆమె రామగుండంలోని హనుమాన్ నగర్ చెందిన రసజ్ఞగా గుర్తించారు. ఆమె కలెక్టరేట్‌ ఎదురుగా ఉన్న మీ సేవా కేంద్రంలో పనిచేస్తోంది. ఈ క్రమంలో ఈ రోజు ఉదయం మీ సేవా కేంద్రం వద్దకు వచ్చిన యువకుడు మాట్లాడాలని ఆమెను బయటకు పిలిచాడు. అనంతరం యువతిపై దాడి చేసి ఘాతుకానికి పాల్పడ్డాడు. నిందితుడు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంకు చెందిన వంశీధర్‌ అని పోలీసులు తెలిపారు. ఇరువురి ప్రేమ వ్యవహారమే హత్య కారణంగా అనుమానిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement