హత్య చేసి, ఆపై తల నరికి...

Witch Hunting Murder Woman Beheaded And Her Husband Killed In Jharkhand - Sakshi

జార్ఖండ్‌ : చేతబడి చేస్తున్నారనే అనుమానంతో గ్రామస్తుల చేతిలో వృద్ద దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. కుంతి జిల్లాలోని దద్గామా గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. దద్గామా గ్రామానికి చెందిన సత్రి ముండా, జావ్నీ దేవి దంపతులు చేతబడి చేస్తున్నారనే అనుమానంతో కొంత మంది గ్రామస్తులు వారితో తరచూ గొడవపడేవారు. ఈ క్రమంలో గురువారం అర్ధరాత్రి వీరి ఇంటిలోకి ప్రవేశించిన ఆరుగురు వ్యక్తులు.. పదునైన ఆయుధంతో ముండాపై దాడి చేయడంతో అతడు అక్కడిక్కడే మరణించాడు. భర్తపై దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన జావ్నీని కూడా దారుణంగా హతమార్చిన దుండగులు ఆమె తల నరికి దూరంగా పడేశారు. ఈ సమయంలో ఇంట్లోనే ఉన్న ముండా కుమారుడు, కోడలు, మనవరాలిపై కూడా దుండగులు దాడికి యత్నించగా వారు తప్పించుకొని పారిపో​యారు.

కాగా మూఢ నమ్మకాల వల్లే ఈ హత్య జరిగినట్లు భావిస్తున్నామని.. అయితే అన్ని కోణాల్లో విచారణ జరపాల్సిన అవసరం ఉందని కుంతి ఎస్పీ అశ్విన్‌ కుమార్‌ సిన్హా తెలిపారు. ఈ కేసులో ప్రాథమిక విచారణ పూర్తయిందని... ఆరుగురు నిందితులను గుర్తించామని త్వరలోనే వారిని అరెస్టు చేస్తామని ఆయన పేర్కొన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top