సాక్షి, హైదరాబాద్: ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) ప్లానింగ్ విభాగం మాజీ డైరెక్టర్ పురుషోత్తంరెడ్డి కేసులో ఏసీబీ ఆయన బినామీలపై ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. ఆయనకు బినామీలుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న యాదవరెడ్డి, నిషాంత్రెడ్డిలను మూడో రోజు కస్టడీలోకి తీసుకొని విచారించింది. ఇప్పటివరకు ఏసీబీ నిర్వహించిన దాడుల్లో పలు భూములకు చెందిన డాక్యుమెంట్లు, మూసాపేట, అమీర్పేట, సోమాజీగూడల్లోని కమర్షియల్ కాంప్లెక్స్ల పత్రాలను స్వాధీనం చేసుకుంది. అలాగే అల్లుడు చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పురుషోత్తంరెడ్డి రూ. 30 కోట్ల వరకు పెట్టుబడి పెట్టినట్లు ఏసీబీ గుర్తించింది.
ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది...కాంప్లెక్స్లను ఎప్పుడు, ఎవరి నుంచి కొన్నారు...వాటిని ఎవరు పర్యవేక్షిస్తున్నారు...నిషాంత్రెడ్డి బినామీగా నడిపిస్తున్న రియల్ ఎస్టేట్ సంస్థలోకే డబ్బు రావడం వెనకున్న ఆంతర్యం ఏమిటి అనే అంశాలపై ఏసీబీ ప్రధానంగా ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. కూతురుకు రూ. 3.2 కోట్ల విలువైన ఓ భవనం గిఫ్ట్ డీడ్గా చేసిన విషయాలపైనా ప్రశ్నించినట్టు తెలిసింది. ప్రధాన బినామీగా ఉన్న శ్రీనివాస్రెడ్డి వ్యాపారాలు, అందులో పురుషోత్తంరెడ్డి పెట్టిన పెట్టుబడులు, ఇతర ఆదాయ వ్యవహారాలపై యాదవరెడ్డితోపాటు నిషాంత్రెడ్డిని ప్రశ్నించినట్టు సమాచారం. ఇప్పటివరకు బయటపడ్డ ఆస్తుల్లో బినామీలుగా వ్యవహరిస్తున్న వారి వాటా? బినామీలు చేస్తున్న వ్యాపారాల్లో పురుషోత్తంరెడ్డి వాటా ఎంత అన్న అంశాలను ఏసీబీ గుర్తించినట్టు తెలిసింది.
మిగతా ఆస్తులపైనా...
ఇప్పటివరకు రూ. 45 కోట్ల వరకు ఆస్తులున్నట్లు గుర్తించిన ఏసీబీ అధికారులు మిగతా ఆస్తులపైనా యాదవరెడ్డి, నిషాంత్రెడ్డిలను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇతర రాష్ట్రాల్లోనూ పురుషోత్తంరెడ్డి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై వారి నుంచి ఏసీబీ స్పష్టత తీసుకున్నట్లు తెలియవచ్చింది. కుమార్తె వివాహం సందర్భంగా కొన్న వజ్రాభరణాలకు డబ్బు ఎక్కడిదిన్న అంశాలపై పదే పదే ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. అధికార పార్టీకి చెందిన ఓ శాసనసభ్యుడికి, పురుషోత్తంరెడ్డికి ఉన్న లింకులేంటి... వాటి వెనకేమైనా ఆర్థిక లావాదేవీలున్నాయా అనే అంశాలపైనా లోతుగా ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. అదే విధంగా పురుషోత్తంరెడ్డి బినామీ శ్రీనివాస్రెడ్డి ఇంట్లో సోమవారం ఏసీబీ సోదాలు నిర్వహించనున్నట్లు తెలిసింది. ఇప్పటికే కోర్టు నుంచి అనుమతి పొందిన ఏసీబీ సోదాలు నిర్వహించి మరిన్ని కీలక ఆస్తుల వివరాలు సంపాదించే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది.
ఆ ఆస్తుల వెనుక ఎందరు?
Published Mon, Feb 19 2018 2:14 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఖరీదైన కారులో వడా పావ్ : ఢిల్లీ ‘కుమారాంటీ’ మరో సంచలనం
‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
ప్రశాంతంగా నీట్
కొత్త గనుల ఏర్పాటుకు కృషి చేయాలి
ప్రమాదంలో ప్రజాస్వామ్యం
అ‘పూర్వ’ం.. ఆత్మీయం
కొడుకులు చూస్తుండగానే పోయిన ప్రాణాలు
నిప్పుల కొలిమి..
బీజేపీ అధికారంలోకి వస్తే భవిష్యత్ అంధకారం
మెట్ గాలాలో మెరిసిన అలియా.. చీరలో ఎంత అందంగా ఉందో..!(ఫోటోలు)
తప్పక చదవండి
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- Rekha Jhunjhunwala: ఒక్కరోజులోనే రూ.800 కోట్ల నష్టం
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- ‘ఒకవేళ బెయిల్ ఇస్తే’.. కేజ్రీవాల్కు కండీషన్ పెట్టిన సుప్రీంకోర్టు
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
- మెట్ గాలా 2024: అలియా టూ అంబికా మోదీ మెరిసిన బ్యూటీస్ (పోటోలు)
- LS Elections: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్.. ఓటింగ్ శాతం ఎంతంటే..
Advertisement