జగ్గయ్యపేటలో ఘోర రోడ్డు ప్రమాదం | Road Accident At Garikapadu Check Post In Jaggayyapeta | Sakshi
Sakshi News home page

జగ్గయ్యపేటలో ఘోర రోడ్డు ప్రమాదం

Nov 3 2019 9:40 AM | Updated on Nov 3 2019 3:46 PM

Road Accident At Garikapadu Check Post In Jaggayyapeta - Sakshi

సాక్షి, కృష్ణా : జిల్లాలోని జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్‌పోస్ట్‌ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు కార్లు ఢీకొన్న ఘటనలో ఐదుగురు దుర్మరణం చెందారు. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌ నుంచి విజయవాడ వస్తున్న ఓ కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోగా.. ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మృతులను తెలంగాణలోని మహబూబ్‌నగర్‌ జిల్లా చెందిన నారపోగు గోపయ్య, షేక్ మన్సూర్, మట్టపల్లి భీంరెడ్డి, పోతుల భీం రెడ్డి ,విస్రం కోటేశ్వరరావు లుగా గుర్తించారు. మృతుల బంధువులకు ఏపీ పోలీసులు సమాచారం అందించారు. అయితే అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement