రైలు కింద పడి ఒకరి మృతి | Man Died In Train Accident | Sakshi
Sakshi News home page

రైలు కింద పడి ఒకరి మృతి

Apr 12 2018 12:03 PM | Updated on Apr 12 2018 12:03 PM

Man Died In Train Accident - Sakshi

మృతి చెందిన వ్యక్తి

బొబ్బిలి: మండలంలోని దిబ్బగుడివలస రైల్వే గేటు వద్ద రైలు కిందపడి ఒకరు మృతి చెందినట్లు జీఆర్‌పీ ఎస్సై సీహెచ్‌ఎల్‌ఎన్‌ శ్రీనివాసరావు తెలిపారు. ఆయన తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. బుధవారం మధ్యాహ్నం జరిగిన ఈ ప్రమాదంలో మక్కువ మండల కేంద్రానికి చెందిన బొద్దాన కాశి (38) మృతి చెందినట్లు గుర్తించారు. ప్రమాదం ఎలా జరిగిందో తెలియరాలేదు. దిబ్బగుడివలస గేటు, సీతానగరం మధ్యలో ఇతను మృతి చెంది ఉన్నాడు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement