ఐదేళ్ల బాలికను పైశాచికంగా..

Gang Rpae On 5 Years Old Girl In Thane - Sakshi

థానే : మహారాష్ట్రలోని థానేలో దారుణం చోటు చేసుకుంది. అభం శుభం తెలియని ఐదేళ్ల బాలికపై సామూహిక అత్యచారం జరిగింది. కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు బాలికపై అతి పైశాచికంగా అత్యచారానికి పాల్పడినట్లు వైద్యులు తెలిపారు. ఓ బాలిక రోడ్డుపై ఏడుస్తుండగా ఒక వ్యక్తి ఆ బాలికను థానే పోలీస్‌స్టేషన్‌కి తీసుకుని వెళ్లి పోలీసులకు అప్పగించాడు.

అనుమానం వచ్చిన పోలీసులు బాలికకు వైద్య పరీక్షలు చేయించారు. బాలికపై అత్యాచారం జరిగిందని వైద్యులు నిర్ధారించారు.  పోలీసులు ఈ ఘటనపై  కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top