5 ఆర్టీసీ బస్సులు దగ్ధం

Five RTC Buses Burned To Ashes In Warangal - Sakshi

సాక్షి, వరంగల్‌ : నగరంలోని ఆర్టీసీ డిపోలో గురువారం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఐదు బస్సులు దగ్ధం అయ్యాయి. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. దీనిపై రవాణా శాఖ మంత్రి మహేందర్‌ రెడ్డి ఆరా తీశారు. ఘటనపై విచారణకు ఆదేశించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని అధికారులను కోరారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సివుంది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top