5 ఆర్టీసీ బస్సులు దగ్ధం | Five RTC Buses Burned To Ashes In Warangal | Sakshi
Sakshi News home page

5 ఆర్టీసీ బస్సులు దగ్ధం

Aug 2 2018 6:46 AM | Updated on Sep 5 2018 9:47 PM

Five RTC Buses Burned To Ashes In Warangal - Sakshi

సాక్షి, వరంగల్‌ : నగరంలోని ఆర్టీసీ డిపోలో గురువారం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఐదు బస్సులు దగ్ధం అయ్యాయి. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. దీనిపై రవాణా శాఖ మంత్రి మహేందర్‌ రెడ్డి ఆరా తీశారు. ఘటనపై విచారణకు ఆదేశించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని అధికారులను కోరారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సివుంది.

Advertisement
 
Advertisement
Advertisement